పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

జగన్ పై ప్రత్యర్థి కావలెను

చిత్రం
కడప లోక సభ స్థానం నుంచి  జగన్ పై పోటీ చేసేందుకు కాంగ్రెస్  పార్టీ  అభ్యర్ధుల కోసం గాలిస్తోంది .జగన్ ను ఎలాగైనా ఓడించాలని తపన పడుతున్న కాంగ్రెస్ కి సరైన అభ్యర్దులే దొరకడం లేదు .వేరే పార్టీ నుంచి ఎవరైనా ముందుకొస్తే వారికీ టికెట్ ఇచ్చే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పై పదేపదే విమర్శలు చేస్తోన్న డీఎల్  లాంటి నేతలను బరిలోకి దింపాలనుకున్నా వారు ముందుగానే చేతులు ఎత్తేసారు .టీడీపీ పరిస్తితి కూడా దాదాపుగా అంతే. కాగా   నిన్నటి వరకు వైఎస్ జగన్‌ పై  పోటీగా వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి బరిలోకి దిగుతున్నట్లు  ప్రచారం సాగింది.  మంత్రి వివేకానందరెడ్డి కూడా అల్లుడిని వెంట బెట్టుకుని  ఢిల్లీకి వెళ్లి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలసివచ్చారు. అయితే అధిష్టానం నర్రెడ్డి కి టికెట్  ఇచ్చేందుకు అంత సుముఖంగా లేదు .ఉప ఎన్నికల్లో మంత్రి వివేకానందరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి మధ్య చివరి నిముషంలో లోపాయికారి ఒప్పందాలు కుదురుతాయేమోనన్న అనుమానం అధికార పార్టీలో కలిగిందని ప్రచారం సాగుతోంది .దగ్గర బంధువులు పోటీ చ

ఆ ఐదు నిమిషాలు!

చిత్రం
బెంగళూరులో ఫిబ్రవరి 27 ఆదివారం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన డే/నైట్ మ్యాచ్ `టై' కావడం ఓ ఉత్కంఠ భరిత సన్నివేశం. చివరి రెండు ఓవర్ల ఆట చూస్తుంటే, వరల్డ్ కప్ మ్యాచ్ లంటే ఇంత థ్రిల్ గా ఉంటాయా ? అనిపించకమానదు. మ్యాచ్ చేజారిపోతున్న తరుణంలో భారత్ ఆటగాళ్లు మలుపుతిప్పి టై అయ్యేలా చూశారు. సచిన్ , స్ట్రాస్ ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగానే, ఒకదానితో మరొకటి తీసిపోనట్టుగా రెండు జట్లు తలపడ్డాయి. ఫలితంగా మ్యాచ్ టై అయింది. చివరి ఐదు నిమిషాల ఆట ఎలా సాగిందో మీరే చూడండి....

కేంద్ర బడ్జెట్ పై ఆశలు- వాస్తవాలు

చిత్రం
  ఫిబ్రవరి నెలాఖరులో దేశ ప్రజలంతా ఒక దృశ్యాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. కేంద్రంలో ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి,  బడ్జెట్ పత్రాలున్న బ్రీప్ కేస్ ను పట్టుకుని ఎంతో హుందాగా పార్లమెంట్ లోకి అడుగుపెడతారు. ఆయన రాకకోసమే గౌరవసభ్యులంతా ఎదురుచూస్తుంటారు. బడ్జెట్ పత్రాలను తీసి చదవడం ప్రారంభించగానే అంతటా నిశ్శబ్దం. ఒక్క పార్లమెంట్ లోనే కాదు. యావత్ జాతి బడ్జెట్ ఎలా ఉన్నదో తెలుసుకోవాలని ఎంతో శ్రద్ధగా వింటుంది. అందరిలో ఎందుకింత ఆసక్తి? బడ్జెట్ ఎటు పోతే మనకేమిటని ఊరుకోవచ్చుకదా... కానీ, అలా ఉండిపోలేం. ఎందుకంటే, కేంద్రం ప్రతిఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ - దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై ప్రభావితం చూపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బడ్జెట్ దేశ ప్రజల బతుకుబండిని నడిపిస్తోంది. అందుకే, బడ్జెట్ కు అంత క్రేజ్. మరి, ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతున్నది?   బడ్జెట్లో కేటాయింపులు ఎన్ని చేసినా, అసంతృప్తి వీడటంలేదు. మంత్రులు కూడా తమ శాఖకు చేసిన కేటాయింపులు చాలవనీ, మరింత కేటాయిస్తేనే, `అభివృద్ధి' పట్టాలు తొక్కుతుందని- మైకు పుచ్చుకుని చెప్పడం మనందరం వింటూనే ఉన్నాం. అయితే, వాస్తవాలేమిటో కూడా ఓసారి చూడాలి. కేంద్ర మ

సెల్ రేడియేషన్ - పక్షులకు యమగండం

చిత్రం
కాకితో కబురుపెడితే చాలు వచ్చి ఇంట్లో వాలిపోతాడు - అంటూ దురపు బంధువులపై చురకలేయడం మనకు తెలిసిందే. పావురాలతో ప్రేమికులు తియ్యటి సందేశాలను పంపుకోవడం కథల్లో కనబడుతూనే ఉంటుంది. హంసరాయబారాలు, చిలుక రాయబారాలు ప్రబంధాల్లో ఉండనే ఉన్నాయి. కొత్త దంపతుల సంసారాన్ని పోల్చాలన్నప్పుడు చిలకా గోరింకలనో, లేదా పిచ్చుకలతోనూ పోలుస్తుంటారు. మానవ జీవితాలతో ఇంతగా మమేకమైన పక్షులకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చేసింది.  ప్రకృతి శాపాలను, కోపాలను తట్టుకుంటూ బతుకు లాగిస్తున్న పక్షులకు మానవ తప్పిదాలు కూడా తోడయ్యాయి.  వేటాడే హంతకులను నుండి పక్షులు తప్పించుకోవచ్చేమోకానీ, అంతకంటే సైలెంట్ కిల్లర్స్ గా తిరగాడుతున్న హంతకుల నుంచి మాత్రం అవి తప్పించుకోలేకపోతున్నాయి.  ఇంచుమించుగా ప్రతి ఒక్కరి వద్ద సెల్ ఫోన్లు ఉంటున్నాయి. అవన్నీ రేడియేషన్ విడుదల చేస్తూనే ఉంటాయి. రేడియేషన్ తరంగాలు మన కంటికి కనిపించకపోవచ్చు. కానీ అవి చేసే హానీ అంతాఇంతాకాదు. సెల్ టవర్స్ నుంచి నిరంతరాయంగా రేడియేషన్ తరంగాలు విడుదలవుతూనే ఉంటాయి. ఆమాటకొస్తే, కనిపించని ఈ తరంగ పౌనఃపున్యాలు రేడియో టవర్స్ నుంచీ అలాగే టివీ టవర్స్ నుంచి కూడా వెలువడుతూనే ఉంటాయి.    .హైఫ్రీక్

రైల్వే బడ్జెట్ - ఎవరికి మేలు?

  నెలంతా ఇల్లు గడవాలన్నా, బతుకుబండి సాఫీగా సాగాలన్నా, బడ్జెట్ చూసుకోవాల్సిందే. లెక్కాపత్రం లేకుండా ఎడాపెడా ఖర్చుపెట్టేస్తే, చివరకు అప్పుల తిప్పలు తప్పవు. ఇంటి పరిస్థితి అయినా, దేశం పరిస్థితి అయినా ఒకటే. అందుకే బడ్జెట్ల సీజన్ రాగానే అందరి చూపు అటే పడుతుంది. కేంద్ర బడ్జెట్ కు ముందు దూసుకురాబోతున్న రైల్వే బడ్జెట్ పై సగటు ప్రయాణీకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసారి రైల్వే బడ్జెట్ ఎలా ఉండబోతున్నది. పొగ బండి, సెగలు కక్కుతుందా, లేక సామాన్యుడి కంటనీరు తుడుస్తుందా? `బతుకు బండిని నడిపేది రైలు బండి...' అంటూ పాటలు కూడా ఉన్నాయి. ఇది నిజమే. మనదేశ పౌరుల జీవనస్థితిగతులు తెలుసుకోవాలంటే ఒక్కసారి రైలెక్కితేచాలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టే, పొగలు, సెగలు కక్కుతున్న రైల్వే బడ్జెట్ పై మరోసారి అందరి చూపు పడుతోంది. ఈసారి రైల్వే బడ్జెట్ లో మనరాష్ట్రానికి ఒరిగేదేమిటి? కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా, మన రాష్ట్రానికి నామమాత్రపు కేటాయింపులే ఎందుకు దక్కుతున్నాయి? `కేంద్రంలో మంత్రిపదవి ఆఫర్ వస్తే ఏ శాఖ కావాలంటారు' అని మీరు ఎవరైనా ఎంపీని అడగండి.... రైల్వే శాఖ అని ఠక్కున చెబుతారు. అంతేమరి.. అద

సౌర తుపాను వచ్చేస్తోంది

చిత్రం
 సూర్యుడు భయంకంగా నిప్పులు చిమ్ముతున్నాడు. వచ్చే రెండేళ్లలో సౌరతుపాను తాకిడికి భూమిచుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు దెబ్బతినవచ్చు. అంతేకాదు, మరికొన్ని ప్రమాదాలు కూడా పొంచిఉన్నాయి. 1. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చు. (కొన్నినెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు) 2. ఫోన్లు పనిచేయవు. 3. విమానాలు కూలిపోతాయి. (సమాచార వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల)

Jagan's Health Deteriorates

చిత్రం
The health condition of the fasting former Kadapa MP Y S Jagan Mohan Reddy showed mild signs of deterioration on Monday as his Deeksha entered fourth day. A team of doctors visited the hunger strike camp at Indira Park and examined Jagan. The young leader is running mild temperature and complained of weakness. Jagan had launched his week-long Deeksha on February 18 , demanding immediate clearance of fee reimbursement dues in the interests of the student community. Apart from a large number of students, as many as 19 MLAs attended his Deeksha camp and expressed solidarity with him. Though the government had sought resolve the issue by holding talks with the representatives of private professional colleges and released Rs 600 crore towards partial clearance of the dues, Jagan has refused to end his stir. His Deeksha is scheduled to conclude on February 24. “The government will be responsible if anything happens to Jagan’s health,” warned Konda Surekha, the fiery MLA from

`సెగ'బండి బడ్జెట్

చిత్రం
   నెలంతా ఇల్లు గడవాలన్నా, బతుకుబండి సాఫీగా సాగాలన్నా, బడ్జెట్ చూసుకోవాల్సిందే. లెక్కాపత్రం లేకుండా ఎడాపెడా ఖర్చుపెట్టేస్తే, చివరకు అప్పుల తిప్పలు తప్పవు. ఇంటి పరిస్థితి అయినా, దేశం పరిస్థితి అయినా ఒకటే. అందుకే బడ్జెట్ల సీజన్ రాగానే అందరి చూపు అటే పడుతుంది. కేంద్ర బడ్జెట్ కు ముందు దూసుకురాబోతున్న రైల్వే బడ్జెట్ పై సగటు ప్రయాణీకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసారి రైల్వే బడ్జెట్ ఎలా ఉండబోతున్నది. పొగ బండి, సెగలు కక్కుతుందా, లేక సామాన్యుడి కంటనీరు తుడుస్తుందా? `బతుకు బండిని నడిపేది రైలు బండి...' అంటూ పాటలు కూడా ఉన్నాయి. ఇది నిజమే. మనదేశ పౌరుల జీవనస్థితిగతులు తెలుసుకోవాలంటే ఒక్కసారి రైలెక్కితేచాలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టే, పొగలు, సెగలు కక్కుతున్న రైల్వే బడ్జెట్ పై మరోసారి అందరి చూపు పడుతోంది. ఈసారి రైల్వే బడ్జెట్ లో మనరాష్ట్రానికి ఒరిగేదేమిటి? కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా, మన రాష్ట్రానికి నామమాత్రపు కేటాయింపులే ఎందుకు దక్కుతున్నాయి? ఓ సారి మీరూ ఆలోచించండి....మీ అభిప్రాయాలను తెలియజేయండి... ఎన్.ఆర్. తుర్లపాటి 9885292208 nrturlapati@gmail.com

ఇదండి సంగతి - నవ్వుల ఫీచర్

చిత్రం

సరదాగా కాసేపు....నవ్వుకోండి

చిత్రం
సరదాగాకాసేపు నవ్వుకోవడానికీ, పుష్పకవిమానంలో విహరించడానికి మీకోసం.... ఈ లఘుచిత్రం నిర్మాత, దర్శకత్వం కొలికపూడి నీల్. (టివీ5 సీనియర్ జర్నలిస్ట్) 95732 62602 మీ అభిప్రాయాలను ఈ బ్లాగ్ ద్వారా కూడా తెలియజేయండి.

భగ్నముని - వెలెంటైన్స్ స్పెషల్

చిత్రం
ప్రేమ విశ్వవ్యాప్తమైనది. అయితే ఇది మాత్రం ఓ భగ్నప్రేమికుని కథ. రచన, దర్శకత్వం: కొలికపూడి నీల్ రచయత వివరాలు: టివీఫైవ్ లో సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్  - 95732 62602

అంతరిక్ష చెత్త!

చిత్రం
  భూమిమీద పేరుకుపోతున్న చెత్తను వదిలించుకోవడానికే నానాహైరానపడుతుంటే, ఇప్పుడు అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్త కూడా పెనుమస్యగామారిపోయింది. మానవాళికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయోగిస్తున్న ఉపగ్రహాలకు స్పేస్ గార్బేజీ భద్రత లేకుండా చేస్తోంది.  ఏభైఏళ్ల కిందట మొట్టమొదటిసారిగా కృత్రిమ ఉపగ్రహాన్ని మనిషి ప్రయోగించిననాటికీ, వేలాదిగా ఉపగ్రహాలు తిరగాడుతున్న నేటి పరిస్థితిలో ఎంతో మార్పువచ్చింది. పనికిరాని శకలాలతో అంతరిక్షం ఓ చెత్తకుండీలా మారిపోతోంది.  అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, సోవియట్ యూనియన్ పోటీపడుతున్న కాలం అది. సరిగా అలాంటప్పుడే సోవియట్ యూనియన్ 1957లో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ `స్పుత్నిక్' ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. అప్పటి నుంచి అనేక దేశాలు కృత్రిమ ఉపగ్రహాలవైపు దృష్టిపెట్టాయి. శాటిలైట్స్ ప్రయోగాలపట్ల జిజ్ఞాసను పెంచుకున్నాయి. సరిగా ఆసమయంలోనే అంతరిక్షంలో చెత్త పేరుకుపోవడానికి కూడా బీజం పడింది.   50కిపైగా దేశాలు తమకు కావలసిన సేవలకోసం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నాయి. 18వ శతాబ్దిలో కాల్పనిక వస్తువుగా ఉన్న శాటిలైట్,  ఆ తరువాత వాస్తవరూపం దాల్చింది.  ఉపగ్రహాలన

బడ్జెట్ లో మహిళ వాటా రూ. 1200

మీకీ విషయం తెలుసా.... మన ఘనమైన కేంద్ర ప్రభుత్వం మరికొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రకటించబోతున్నది. అందులో మహిళలకు అందే వాటా ఎంతో తెలుసా...ఏడాదికి ప్రతి ఒక్క మహిళకు వివిధ సంక్షేమ పథకాల కింద అందే మొత్తం అక్షరాలా కేవలం 1200 రూపాయలు మాత్రమే. ఆకాశంలో సగభాగం అంటూ ఆవేశపడే మహిళలారా....ఈ విషయం ఆలోచించండి. బడ్జెట్ లో సగం రాకపోతేమానే...కానీసం ఏడాదికి అందే 1200 రూపాయలతో మీరు ఏమేరకు లబ్దిపొందగలరు? 1200 రూపాయలతో నెల కూడా గడవదు. ఇదీ మన ఘనమైన కేంద్ర ప్రభుత్వం మహిళకు వేస్తున్న పెద్దపీట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) రాబోతున్న తరుణంలో మైకు పుచ్చుకుని ఉపన్యాసాలు ఇచ్చే మహిళలారా బడ్జెట్ లో మీ వాటా గురించి ముందు తేల్చుకోండి...మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.                                                                                                                     - ఎన్.ఆర్. తుర్లపాటి                                                                                                                    (nrturlapati@gmail.com)