పోస్ట్‌లు

డిసెంబర్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

జ‌ర్నలిస్టుల నిర‌స‌న‌లు..

చిత్రం
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాన్ని కొందరు జర్నలిస్టులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంత సరైన చర్య అనిపించుకోదు. సమావేశంలో టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేయడంపై వీరు నిరసన వ్యక్తం చేశారని చెబుతున్నారు. జర్నలిస్టులు ఎవరైనా గొడవ చేస్తుంటే వాటిని కవర్ చేయడం జరుగుతుంటుంది. కాని అందుకు భిన్నంగా వారే నిరసన తెలపడం జర్నలిజంలో కొత్తపోకడగా బావించాలి. మన దేశంలో భావస్వేచ్చ ఉందని,పత్రికా స్వేఛ్చ ఉందని , దానివల్లనే వారు ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నారని మర్చిపోయి , వారే ఎదుటివారి స్వేచ్చకు ఆటంకం కలిగించడం, ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అనుకూలంగా బహిరంగంగా వ్యవహరించడం సరైన పద్దతి అనిపించుకోదు.ఒక వేళ సమావేశంలో మాట్లాడినవారి అబిప్రాయాలతో ఏకీభవించకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవచ్చు. తమ పత్రికలలోనో, టీవీలలోనో తమకు నచ్చిన రీతిలో వార్తలు ఇచ్చుకోవచ్చు. అలాకాకుండా జర్నలిస్టులే ఇలాంటి చర్యలు దిగడంలో ఆంతర్యం ఏమిటో అర్దం కాదు.ఎదుటివారు వాదించడానికి చెప్పడానికి అవకాశం ఇవ్వ

లొల్లి రాష్ట్రప‌తి ద‌గ్గర‌కు వెళ్తుందా..?

చిత్రం
మంత్రి శంకర్రావుపై దాడి జరిగిన విషయాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ దృష్టికి తీసుకుపోనున్నామని ఎమ్మార్పీయస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. రాష్ట్రపతిని కల్సిన తర్వాత కూడా తగిన చర్యలు లేకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన అన్నారు. హోంమంత్రిగా సబిత ఇంద్రారెడ్డి అనర్హురాలని.. ఆమెను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి దాడి చేసిన వారిపై కేసులలు నమోదు కాకుండా హోం మంత్రి స్థానిక పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

కంగారూల చేతిలో కుదేల‌య్యారు..

చిత్రం
భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 122 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇండియా 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా స్కోర్లు – 333, 240 కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 282 గా ఉంది. విదేశాల్లో భారతికి వరుసగా ఐదో ఓటమి. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టగా, టెండుల్కర్ 32, అశ్విన్ 30 పరుగులు చేయగలిగారు. టెస్ట్‌లో మొత్తం ఆరు వికెట్లు తీసిన ఆసిస్ బౌలర్ ప్యాటిన్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. బ్యాటింగ్‌లో వైఫల్యం వల్లే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోయామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేర్కొన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తమ బ్యాటింగ్ ఘోరంగా ఉందని మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. మొదటి టెస్ట్‌లో ఆసీస్ చేతిలో 122 పరుగుల తేడాతో ఓడిపోవడం పట్ల ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘థానే’ తో తీరాలు అల్లక‌ల్లోలం..

చిత్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన థానే తుపాను తీర ప్రాంతాన్ని కలవర పరుస్తోంది. బుధవారం తీరంలో తుపాను ప్రభావం పెరిగింది. సముద్ర తీరం వెంబడి అలల తీవ్రత పెరిగింది. నిజాంపట్నం హార్బర్ వద్ద అలలు ఎగసి పడుతుండటంతో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే నిజాంపట్నం హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. బాపట్ల నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఒక పడవలోని నలుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. తుపాను ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి వాతావరణంలో పెనుమార్పు చోటు చేసుకుంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. రేపల్లె ప్రాంతంలో చిరు జల్లులు పడ్డాయి. నిజాంపట్నం హార్బర్ వద్ద రెండో నెంబర్ ప్రమాద సూచిక కొనసాగుతోంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యం త్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీర ప్రాంతంలో ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అలాగే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసి అందరూ అందుబాటులో ఉండాలన

ఉనికి కోసం బాబు పాట్లు

చిత్రం
పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన గురువారం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తెలంగాణ సాధన కోసం అధిష్టానంపై ఒత్తిడి కొనసాగిస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. బాబుకు చిత్తశుద్ది ఉంటే చిదంబరానికి తెలంగాణపై లేఖ ఇవ్వాలన్నారు. టీడీపీ-టీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణపై స్పష్టత లేదని మంత్రి పేర్కొన్నారు.

గాలికి మ‌ళ్లీ చుక్కెదురే..!

చిత్రం
ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిల జ్యుడిషియల్ రిమాండ్ ను జనవరి 12వ తేదీ వరకూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంపొడిగించింది. చంచలగూడ జైల్లో ఉన్న వీరిని న్యాయమూర్తి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు.  కాగా తన తల్లి వర్థంతికి హాజరయేందుకు రెండు రోజులు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్దనరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో బళ్లారిలో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ వేసిన ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అత‌నే ‘కిర‌ణం’

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అధిష్టానంలో పట్టు పెరిగిందని ఆయన శిబిరంలోని ముఖ్యులు వ్యాఖ్యా నిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి పని చేస్తున్న తీరుపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు నమ్మకం కుదురుతోందన్నది వీరి వాదనగా ఉంది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం అందులో ఒకటి కాగా, ప్రభుత్వాన్ని ఆయన ముందుకు తీసుకు వెళుతున్న తీరు కూడా మరో ముఖ్యమైన అంశమని వారు వివరిస్తున్నారు. ప్రత్యేకించి యువనేత, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు అయిన రాహుల్ గాంధీ కూడా కిరణ్ పట్ల సంతృప్తి కనబరుస్తున్నారని అంటున్నారు. రాహుల్ ప్రత్యేకించి అన్నారో లేదో కాని ఆయన వద్ద పనిచేసే ఒక ముఖ్యమైన బాధ్యుడు మాత్రం ఒక వ్యాఖ్య చేశారట. రెండువేల పద్నాలుగులో ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిస్తే ఎలాగూ కిరణ్ కుమార్ రెడ్డే నాయకత్వం వహిస్తారు. వివిధ రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ ఓడిపోతే కనుక తిరిగి 2019 ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ తరపున నాయకత్వ బాధ్యతలు కిరణ్ కుమార్ రెడ్డే వ్యవహరిస్తారని అన్నారట. ఈ విషయం ఉత్తరప్రదేశ్ లో ప్రచార బాధ్యత

2011.. హిట్సూ.. ఫ్లాప్స్‌..

చిత్రం
2012కి స్వాగ‌తం ప‌లుకుతూ 2011 సంవ‌త్సరం ముగియ‌ బోతోంది.. ఈ సంద‌ర్భంగా ఒక‌సారి  తెలుగు చిత్రాల జ‌యా ప‌జ‌యాల గురించి రివ్యూ చేస్తే… 2010 సంవ‌త్సరం క‌న్నా ఈ సంవ‌త్సరం తెలుగు చిత్రాల విజ‌యాలు కాస్త మెరుగ్గానే ఉన్నా తెలుగు చిత్రసీమ‌కి ఈ విజ‌యాలు స‌రిపోవు. సంవ‌త్సరం మొద‌ట్లో వ‌చ్చిన స్టార్ హీరోల చిత్రాలు ఘోర ప‌రాజ‌యాలు కావ‌డం అంద‌రినీ నిరాశ‌ప‌రిచిన‌ప్పటికీ సంవ‌త్సరం చివ‌ర్లో వ‌చ్చిన చిత్రాలు వ‌రుస‌గా వ‌సూళ్ళు సాధించ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. 2011లో మొత్త వ‌చ్చిన తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు 114 కాగా త‌మిళం, క‌న్నడం, మ‌ళ‌యాలం, హిందీ భాష‌ల‌నుండి డ‌బ్బింగ్ అయిన చిత్రాల సంఖ్య 120 ఉండ‌టం విశేషం. అయితే డ‌బ్బింగ్ చిత్రాల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్నప్పటికీ విజ‌యాల‌ని న‌మోదు చేసుకున్న చిత్రాలు మాత్రం నాలుగ‌యిదు కంటే ఎక్కువ‌గా లేవు. తెలుగు స్ట్రెయిట్ విష‌యాల‌కి వ‌స్తే… ‘పరమవీరచక్ర’, ‘మిరపకాయ్’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల‌య్యాయి.. మరో బెబ్బులిపులి అంటూ విడుదలకు ముందు గాండ్రించిన పరమవీరచక్ర… పిల్లిలా కుదేలైపోయింది. దాసరి నారాయణరావు-బాలకృష్ణల కలయిక

ఉత్తర కోస్తాకు పెను తుఫాను

చిత్రం
పెనుతుఫాన్‌గా మారిన ‘థానే’ చెన్నైకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని రేపు ఉదయం చెన్నై- నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడుతోపాటు మన రాష్ట్రంలోని దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉత్తరకోస్తాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

సిఎం ఢిల్లీ టూర్ వెనుక‌..

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హటాత్తుగా డిల్లీ వెళుతుండడంతో రాజకీయ వర్గాలలో మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఇంతవరకు వారికి ఇస్తామన్న మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై ఆ వర్గం గుర్రుగా ఉంది. అలాగే మంత్రివర్గంలో డాక్టర్ శంకరరావు, డి.ఎల్.రవీంద్ర రెడ్డి వంటి కొద్ది మందితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సరిపడడం లేదు.శంకరరావు అయితే మరీ రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారన్న అబిప్రాయం ఉంది. ఇదంతా కాంగ్రెస్ కు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట కలుగుతున్నదన్న వాదన కూడా ఉంది.అలాగే పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ను మంత్రి పదవి నుంచి తప్పించాలని కూడా ముఖ్యమంత్రి కోరుతున్నారు.ఈ నేపధ్యంలో పార్టీ అధిష్టానంతో మంత్రివర్గంలో మార్పులు,చేర్పుల గురించి చర్చించవచ్చని భావిస్తున్నారు.అయితే తెలంగాణ అంశం పరిష్కారం కాకుండా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా అన్న సందేహం ఉంది. అలా కాని పక్షంలో మంత్రివర్గ విస్తరణ కేవలం చిరంజీవి వర్గానికి పరిమితం కావచ్చని అంటున్నారు.

బోత్స మాస్టర్ ప్లాన్‌

చిత్రం
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారా యణ మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనను ముఖ్యమంత్రి ఇరికించి అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్న బొత్స సత్యనారాయణ ఏకంగా నూట అరవై మంది ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ చేయించి ఎవరెవరికి మద్యం వ్యాపారంతో సంబందం ఉందో తేల్చాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి సంచలనం సృష్టించారు.స్వయంగా ఆయన ఈ లేఖను ముఖ్యమంత్రికి అందచేయడమే కాకుండా పార్టీ హై కమాండ్ కు కూడా ఈ లేఖ ప్రతిని పంపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు చేసే ఆరోపణలతో మనం ఏమి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారని కధనాలు వస్తున్నాయి. అయినప్పట్టికీ సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని బొత్స లేఖను అందచేశారని, ఈ సందర్భంగా వారిద్దరి మద్య కాస్త వాగ్వాదం జరిగిందని కదనాలు వస్తున్నాయి.మధ్యం వ్యాపారం ద్వారా తానొక్కడినే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు రావడంపై బొత్స ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా ఎవరెవరికి మద్యం వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయో తెలిపే జాబితాను కూడా ముఖ్యమంత్రికి బొత్స సమర్పించారని

జ‌న‌వ‌రిలో తెలంగాణ‌..?

చిత్రం
తెలంగాణ అంశంపై కేంద్రం జనవరి మొదటి వారంలో ప్రకటన చేసే అవకాశం ఉందా?తెలంగాణ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం వచ్చే కొద్ది రోజులలో ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయవచ్చని టిఆర్ఎస్ వర్గాలకు, ఇటు కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందుతోంది. కేంద్ర ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దీనిపై ఒక ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఏకాబిప్రాయం లేనందున తెలంగాణ ఇవ్వలేకపోతున్నామని కేంద్రం చేసే ప్రకటన సారాంశంగా ఉండవచ్చు. అంతేకాక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపైకి నెపం నెట్టే యత్నం కూడా జరగవచ్చని అంటున్నారు. అలాగే ఆయా పార్టీలు తెలంగాణ అంశంలో యు టర్న్ తీసుకున్న విషయాన్ని కేంద్రం ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ టిఆర్ ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావులు కలుసుకున్నప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని , ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కుదరకపోవచ్చని పవార్ అన్నట్లుగా టిఆర్ఎస్ వర్గాల

శోక‌స‌ముద్రంలో అక్కినేని కుటుంబం

చిత్రం
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అన్నపూర్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు 79 సంవత్సరాలు. అన్నపూర్ణ మృతితో అక్కినేని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అక్కినేనితో ఫిబ్రవరి 18, 1949 తేదిన అన్నపూర్ణ వివాహం జరిగింది. అన్నపూర్ణకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు నాగార్జున, నిర్మాత వెంకట్ అక్కినేనిలు అన్నపూర్ణ కుమారులు. 2009 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు దంపతులు వివాహ వజ్రోత్సవం జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అన్నపూర్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. తన తల్లి మరణవార్తను తెలుసుకున్న సినీ నటుడు నాగార్జున హుటాహుటిన బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

కోర‌లు లేని లోక్‌పాల్ బిల్లు

చిత్రం
» జ‌ర్నిలిస్టుల నిర‌స‌న‌లు.. » లొల్లి రాష్ట్రప‌తి ద‌గ్గర‌కు వెళ్తుందా..? » కంగారూల చేతిలో కుదేల‌య్యారు.. » ‘థానే’ తో తీరాలు అల్లక‌ల్లోలం.. » ఉనికి కోసం బాబు పాట్లు » గాలికి మ‌ళ్లీ చుక్కెదురే..! » వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అత‌నే ‘కిర‌ణం’ » 2011.. హిట్సూ.. ఫ్లాప్స్‌.. » ఉత్తర కోస్తాకు పెను తుఫాను » సిఎం ఢిల్లీ టూర్ వెనుక‌.. కోర‌లు లేని లోక్‌పాల్ బిల్లు రాజ్యాంగ హోదా కల్పించకుండా లోక్ పాల్ బిల్లును ఆమోదించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇది కోరలు లేని లోక్ పాల్ బిల్లు అని విపక్షాలు, సామాజిక బృందం నేత అన్నా హజారే తీవ్రంగా వ్యాఖ్యాని స్తుండగా, లోక్ సభే సుప్రిం గా ఉండాలని పార్లమెంటు సభ్యులు పలువురు అభిప్రాయ పడుతున్నారు.ఈ బిల్లుకు ఓటింగ్ జరిగిన సమయంలో ఇరవై ఐదు మంది యుపిఎ సభ్యులు కూడా సభలో లేకపోవడం విశేషం.కాగా సమాజవాది పార్టీ, బి.ఎస్.పి, లెఫ్ట్ పార్టీలు వాకౌట్ చేశాయి.అయితే

ఛార్జీల పెంపుతో కాంగ్రెస్‌లో గుబులు

చిత్రం
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తోంది. ఉప ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదన రావడం, దానికి విస్తృతంగా ప్రచారం రావడం,ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థిరపడుతున్నారని భావిస్తున్న తరుణంలో విద్యుత్ ఛార్జీల ప్రబావం ఎలా ఉంటుందోనన్న ఆందోళనను ముఖ్యమంత్రి సన్నిహితులు, కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో అదికారుల మాటకే ప్రాముఖ్యత ఇస్తున్నారని, ఆచరణలో ఏమి జరుగుతుందో ఆలోచించడం లేదని ఒక ఎమ్మెల్సీ అన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన వివిధ పదకాలు కిరణ్ కు పాజిటివ్ వాతావరణం తెచ్చిపెట్టాయని, ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినా ప్రజలు పరిస్థితిని అర్ధం చేసుకుంటారని అదికారులు కిరణ్ కు చెబుతున్నారని, ఆయన కూడా ఇదే అభిప్రాయానికి వస్తున్నారన్న భావన కలుగుతోందని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్నారు.అయితే ఇది ప్రమాదకరమని, కరెంటు ఛార్జీలు పెరిగితే ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత వస్తుందని , చంద్రబాబునాయుడు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచే దెబ్బతిన్నారని వా

పైచేయి సాధించిన కిర‌ణ్‌

చిత్రం
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై చేయి సాధించారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రోజుల క్రిందట కాంగ్రెస్ లో తానే సర్వం అన్న చందంగా బొత్స వ్యవహరించి కాంగ్రెస్ శ్రేణులలో గందరగోళానికి కారకులయ్యారని, అయితే ఆ తర్వాత పరిణామాలలో ఆయన కొంత వెనుకబడి కిరణ్ ది పై చేయి అయిందని కిరణ్ శిబిరం భావిస్తోంది.దానికి రెండు, మూడు కారణాలు ప్రధానంగా చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో ప్రజారాజ్యం వర్గం ఎమ్మెల్యేలు కొందరిని బొత్స రెచ్చగొట్టారని, చిరంజీవిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారని, ఆ విషయం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లిందని కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ఆ మీదట అదిష్టానం బొత్స పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచిందని, ఆ సమాచారం కూడా తమ వద్ద ఉందని వీరు చెబుతున్నారు.పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలేమిటని అధిష్టానం ప్రశ్నించిందన్నది వీరి వాదన.అదే తరుణంలో మద్యం సిండికేట్ల వ్యవహారం , ఎసిబి దాడులతో వెలుగులోకి వచ్చిన అంశాలపై బొత్స

ప‌టోళ్ళ గోవ‌ర్థన్ రెడ్డి దారుణ హ‌త్య

చిత్రం
పరిటాల రవి హత్య కేసులో నిందితుడు పటోళ్ల గోవర్థన్‌రెడ్డి(50) ఆబిడ్స్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. ఆటోలో వెళుతున్న ఆయనను ముగ్గురు దుండగులు కత్తులతో నరికి చంపారు. కొద్ది నెలల క్రితమే ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. రంగారెడ్డి జిల్లా తాండూరు చెందిన ఆయన విప్లవ దేశభక్త పులులు(ఆర్‌టీపీ) అనే సంస్థను స్థాపించి, నడిపారు. పటోళ్ల గోవర్థన్‌రెడ్డి హత్య వెనుక పరిటాల అనుచరులు పోతుల సురేష్, చమన్ పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

జ‌క్కన్న చండ‌శాస‌నుడు

చిత్రం
దర్శకుడు రాజమౌళి చండశాసనుడు అంటూ అక్కినేని నాగార్జున సర్టిఫై ఇచ్చాడు. రాజమౌళి కుర్రాడు కాబట్టి చాలా చురుగ్గా ‘రాజన్న’లో సన్నివేశాల్ని తీశాడు అంటూ ఆయన్ను మెచ్చుకున్నాడు. ‘రాజన్న’ చిత్రం సక్సెస్‌మీట్‌ ఆదివారం రాత్రి మాదాపూర్‌లో ‘ఎన్‌’ కన్‌వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజన్న కథను విజయేంద్రప్రసాద్‌ చాలా కష్టపడి ప్రణాళికప్రకారం జరిపారు. 70 సంవత్సరాల ఏజ్‌లో చాలా చురుగ్గా పనిచేశారు. చాలా ఆశ్చర్యపోయాను. రాజమౌళి అయితే.. తననుకున్నది వచ్చేదాకా ఎవ్వరినీ వదలేదు. చండశాసనుడులాంటివాడు. అలాగే నా మేనకోడలు సుప్రియను చాలా ఇబ్బందిపెట్టాను.. నిర్మాతగా ఆమె ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించింది అన్నారు. ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ… తెలుగులో ఒకప్పటి సావిత్రి, సూర్యకాంతంలాంటి నటీమణులు నేడు లేరేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు బాలనటి యాని రూపంలో వచ్చింది. రాజన్నలో ఆమె నటించిన తీరు అబ్బురపర్చింది. ఇకపోతే… నేను ఈ సినిమాలో రెండు ఫైట్లకు దర్శకత్వం వహించాను. కానీ అంతా రాజమౌళి ముద్ర ఉందని అన్నారు. నేను ఆయన కొడుకును. ఆయన నాకంటే ముందు దర్శకుడు అవ్వాల్

ర‌మ్యభార‌తి క‌థ‌ల‌పోటీ విజేత‌లు వీరే..

చిత్రం

బోర్డర్‌ని దాటేసిన స‌చిన్‌

చిత్రం
టెస్ట్ క్రికెట్‌లో అస్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ రికార్డును భారత క్రికెట్ సంచలనం సచిన్ టెండూల్కర్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్‌లో బోర్డర్ నమోదు చేసిన 64 అర్ధ సెంచరీల రికార్డును సచిన్ తిరగరాశాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సచిన్ 65 అర్ధ సెంచరీని సాధించాడు. ప్రస్తుతం సచిన్ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అన్నా దీక్షకి ఫీవ‌ర్ అడ్డమా..?

చిత్రం
ప‌టిష్ఠమైన లోక్‌పాల్ బిల్లుకోసం అన్నా హ‌జారే దీక్ష చేయ‌డానికి పూనుకున్నారు. అయితే.. గ‌త కొద్ది రోజులుగా అన్నా ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే.. త‌న అనారోగ్యాన్ని కూడా లెక్కచేయ‌కుండా  అన్నా హజారే మూడు రోజుల దీక్షను మంగళవారం ముంబైలో ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేలవమైన లోక్‌పాల్ బిల్లుకు నిరసనగా హజారే మూడు రోజుల దీక్షను చేపట్టనున్నారు. దీక్ష కోసం సోమవారం రాత్రి రాలేగావ్‌సిద్ధి నుంచి ముంబైకి చేరుకున్నారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షను చేపట్టేందుకే మొగ్గు చూపారు. బాంద్రా సబర్బన్ నుంచి ర్యాలీ నిర్వహించి, ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. జుహూలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి ముందుకు సాగనున్నారు. హజారే ర్యాలీ శాంతాక్రజ్, తులిప్ స్టార్ హోటల్, మితిబాయి కాలేజి, ఎస్‌వీ రోడ్, విలే పర్లే, ఖర్, బంద్రా హైవేలలో నిర్వహించనున్నారు.

నిర‌స‌న‌ల మ‌ధ్య బాబు టూర్‌..

చిత్రం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణ వాదులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరుబాట యాత్రను మంగళవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ యాత్రను అడ్డుకుని తీరుతామని తెలంగాణ వాదులతో పాటు తెరాస నేతలు హెచ్చరించారు. ఏది ఏమైనా యాత్ర జరిగి తీరుతుందని తెదేపా శ్రేణులు ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు యాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గం లంబాడిపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెడతారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. సీతారాంపూర్, ములకనూరు, మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామాల మీదుగా నుస్తులాపూర్‌కు యాత్ర చేరుకుంటుందని వివరించింది. సాయంత్రం 5 గంటలకు నుస్తులాపూర్‌లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపింది. ఇదిలావుండగా, తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయకుండా రెండు కళ్ల వాదం, తటస్థ సిద్ధాంతమంటూ నాలుక మడతపెట్టే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును ఇక తెలంగాణలో తిరుగనీయకూడదు… జై తెలంగాణ అ

దీక్షకు రెడీ అవుతున్న కేసీఆర్‌..?

చిత్రం
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు తనపై వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకునో, లేక వ్యూహాత్మ కంగానో వాటిని తిప్పికొట్టడానికో తెరపైకి ప్రముఖంగా వచ్చారు. ఒక డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత మళ్లీ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ప్రకటించారు. వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నామే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని నిలిపివేయలేదని ఆయన స్పష్టం చేశారు.తెలుగుదేశం నేతలు కుక్కల కంటే హీనమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అవసరమైతే మరోసారి ఆమరణ దీక్ష చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే పరిస్థితులు మళ్లీ తీవ్రం అవుతాయా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.సకల జనుల సమ్మె కారణంగా తెలంగాణ ఉద్యమం కొంత దెబ్బ తిన్నదని చెప్పాలి. సకల జనుల సమ్మె వ్యూహ రీత్యా సరైనదే అయినా, దానిని సకాలంలో విరమిస్తున్నట్లు ప్రకటించినా ఉద్యమ నేతలకు పేరు వచ్చేది. అలా కాకుండా జనం నష్టపోయినా ఫర్వాలేదన్నట్లు వ్యవహరించడంతో దెబ్బతిన్నారు. ఈ నేపధ్యంలో కెసిఆర్ మళ్లీ ఆమరణ దీక్ష చేస్తానంటున్నారు. మరి ప్రజలలో ఎలాంటి