జగన్ పై ప్రత్యర్థి కావలెను

కడప లోక సభ స్థానం నుంచి  జగన్ పై పోటీ చేసేందుకు కాంగ్రెస్  పార్టీ  అభ్యర్ధుల కోసం గాలిస్తోంది .జగన్ ను ఎలాగైనా ఓడించాలని తపన పడుతున్న కాంగ్రెస్ కి సరైన అభ్యర్దులే దొరకడం లేదు .వేరే పార్టీ నుంచి ఎవరైనా ముందుకొస్తే వారికీ టికెట్ ఇచ్చే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పై పదేపదే విమర్శలు చేస్తోన్న డీఎల్  లాంటి నేతలను బరిలోకి దింపాలనుకున్నా వారు ముందుగానే చేతులు ఎత్తేసారు .టీడీపీ పరిస్తితి కూడా దాదాపుగా అంతే. కాగా   నిన్నటి వరకు వైఎస్ జగన్‌ పై  పోటీగా వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి బరిలోకి దిగుతున్నట్లు  ప్రచారం సాగింది.  మంత్రి వివేకానందరెడ్డి కూడా అల్లుడిని వెంట బెట్టుకుని  ఢిల్లీకి వెళ్లి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలసివచ్చారు. అయితే అధిష్టానం నర్రెడ్డి కి టికెట్  ఇచ్చేందుకు అంత సుముఖంగా లేదు .ఉప ఎన్నికల్లో మంత్రి వివేకానందరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి మధ్య చివరి నిముషంలో లోపాయికారి ఒప్పందాలు కుదురుతాయేమోనన్న అనుమానం అధికార పార్టీలో కలిగిందని ప్రచారం సాగుతోంది .దగ్గర బంధువులు పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టమే ఉంటుందని జిల్లా నేతలు పలువురు అధిష్ఠానం దృష్టికి సూచించినట్టు  తెలుస్తోంది. వివేకానందరెడ్డి అల్లుడిని బరిలోకి దించడంపై స్థానిక నేతలు అభ్యంతరం  వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  తన అన్నను విమర్శిస్తే సహించేది లేదని, జగన్‌కు పరిటాల రవి హత్య కేసుతో ఎలాంటి సంబంధాలు లేవని మంత్రి వివేకానందరెడ్డి స్పష్టం చేసిన దరిమిలా కాంగ్రెస్ శిబిరం లో వివేకపై సందేహాలు కలిగాయి అని అంటున్నారు . దీంతో ఉప ఎన్నికల సమరం నాటికి అబ్బాయ్, బాబాయ్‌లు కలిసిపోయే అవకాశాలున్నాయని, అందువల్ల వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడైన నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని పోటీలో దించకుండా ఉండేందుకు వీలుగా జిల్లా నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన మంత్రి వివేకానందరెడ్డి ఇటీవల తన అల్లుడు కడప పార్లమెంట్‌కు పోటీ చేయడం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం..నిన్నమొన్నటి వరకు మంత్రి వివేకానందరెడ్డి అల్లునికే మద్దతు ప్రకటించిన పలువురు నేతలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా వుంటే  టిడిపిలో ఉన్న కందుల శివానందరెడ్డి, ఆయన సోదరుడు రాజమోహన్‌రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి వారిలో ఒకరిని కడప పార్లమెంట్‌కు పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అటు అధిష్ఠానం, ఇటు జిల్లా నేతలు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా  మంత్రి వివేక ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగియనుంది .ఈ క్రమం లోనే జగన్ వర్గం ఆయనకు సీట్ ఆఫర్ చేసింది. పులివెందుల అసెంబ్లీ బరి లో నిలబడకుండా ఆయనను అడ్డుకోవాలని యోచిస్తూ ఈ ఆఫర్  చేసినట్టు సమాచారం .వైఎస్ కుటుంబ సబ్యులు వివేకతో మంతనాలు జరుపుతున్నారు . అయితే వివేకా ఇంకా తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం .చివరికి ఎవరూ దొరకక పోతే వివేక నే జగన్ పై పోటీ కి దింపే అవకాశాలు కూడా లేకపోలేదు .ఎన్నిలలోపు  కడప జిల్లాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చు .. రాజకీయ సమీకరణాలు  మారవచ్చు.
- (జైజై నాయకా సౌజన్యంతో)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!