పోస్ట్‌లు

ఆగస్టు, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

ఖైర‌తాబాద్ గ‌ణేశుడికి గ‌వ‌ర్న‌ర్ పూజ‌లు

చిత్రం
ఖైరతాబాద్ వినాయకుడిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ స్వాగతం పలికారు. విఘ్నేశ్వరుడు రాష్ట్రాన్ని అన్ని విఘ్నాలు తొలగించి ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నానని నరసింహన్ అన్నారు. విఘ్నేశ్వరుడు అందరిని కాపాడాలని ప్రార్ధిస్తున్నానని తెలుగులో ప్రసంగించారు. సికింద్రాబాద్ ఎమ్.పి అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నరసింహన్ ప్రజలందరిని దీవించారని కృతజ్ఞతుల తెలిపారు. ఖైరతాబాద్ లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా వినాయక ్ప్రతిష్ట చేస్తారు. నిమజ్జనం వరకు అక్కడ భారీగా భక్తులు తరలివచ్చి పూజలు చేసుకుంటారు. ఆ తర్వాత నిమజ్జనంలో ఈ గణేషుడికి ప్రత్యేకత ఉంటుంది.హైదరాబాద్ లో గణేషుడు అంటే ఖైరతాబాద్ గణేషుడే అని ప్రజలంతా భావిస్తారు.

21 పత్రాలు – శాస్త్రీయ నామాలు

చిత్రం
వినాయకచవతినాడు 21 పత్రితో గణనాధుడ్ని పూజచేయడం ఆచారంగా వస్తున్నది. ఈ 21 పత్రాలు ఇరువైఒక్క ఔషధ మొక్కల నుంచి సేకరిస్తారు. వాటి వృక్షశాస్త్ర నామాలు మీకోసం ఇస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, వృక్షశాస్త్ర విశిష్టతను గుర్తుచేసే పండుగ ఇదే. భారత దేశం గర్వించతగ్గ ఆయుర్వేదం వనమూలికలతో కూడినదే. అలాగే, అనేక పండుగల అంతరార్ధం సర్వేజనసుఃఖినోభవంతు అనే…మహాగణపతి పూజ కూడా అలాంటిదే. పత్రి పేర్ల                                                   శాస్ర్తియ నామం                                            తెలుగు పేరు మాచీ పత్రం                                             Artemisia.vulgaris మాఛిపత్రి బృహతీపత్రం                                         Solanum.indicum                                            బృహతీపత్రం (ములక) బిల్వపత్రం                                             Aegle.marmelos                                                 భిల్వం (మారేడు) దూర్వాయుగ్మం                

కోరిన‌వ‌రాలిచ్చే కాణిపాకం విఘ్నేశ్వరుడు

చిత్రం
దేవగణాలకు అధిపతిగా అవతరించిన వినాయకుడు ఈ కాణిపాక క్షేత్రంలో స్వయం భువ విఘ్నేశ్వరుడుగా బావి నుంచి ఉద్భవించాడు. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల పాలిట కొంగు బంగారమై ఉద్ధరిస్తున్నాడు. సత్య ప్రమాణాలకు ప్రతీకగా, మానవ పరివర్తనకు మూలస్థానంగా భాసిల్లుతున్న ఈ కాణిపాక క్షేత్రం శాతవాహనుల కాలం నుంచే విశేష పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం. ఒక చారిత్రక సత్యం. పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తిల తరువాత కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చెప్పుకోదగ్గ అపురూప పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి వెయ్యి ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్య ప్రమాణా లకు నెలవుగా ఉంది. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణానికి 12 కి.మీ దూరంలో బహుదా నది ఒడ్డున పచ్చని పంట పొలాల మధ్య వెలసిన ఈ క్షేత్రంకు వింత గొలిపే పురాణ ప్రాశస్త్యం ఉంది. బావిలో దేవుడు ఇక్కడ వెలసిన వినాయకుడు స్వయంభువుడు. బావిలో నుంచి దిన దిన ప్రవర్థమానంగా పెరుగుతున్నాడన్నది భక్తుల నమ్మకం. ఇది నిజమనడానికి ఆధారాలు ఉన్నాయి. వెయ్యి ఏళ్ళ క్రితం చోళ రాజుల ఏలుబడిలో ఉన్న ఈ కాణిప

పర్యావరణ గణపతి

చిత్రం
మహాగణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను పొందుపరిచారు మన పూర్వీకులు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం… 1. కొత్త మట్టితో వినాయకున్ని తయారుచేయడం 2. ఇరువైఒకటి పత్రాలతో పూజ చేయడం 3. నవరాత్రుల అనంతరం పత్రితోసహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం. శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగుపిండితో తయారైన బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసింది ఆది శక్తి పార్వతీదేవి. అనంతరం, ఏనుగు తలను అతికించి పునఃప్రాణప్రతిష్ఠ చేశారు ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆనాటి నుంచి యుగాలు దొర్లుతున్నా, కాలం మారుతున్నా, మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో అనేక వర్గాలవారుంటారు. వారందరినీ, కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం. మానవ రూపంలో ఉన్న వినాయకునికి గజ శిరస్సు అమర్చడం, ఆపైన మూషికుడ్ని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వప్రాణులు సమానమనే అర్థం స్ఫురిస్తోంది. ఆహార

జగన్ ఏం చేయబోతున్నారు?

చిత్రం
షాక్ మీద షాక్… కేసు మీద కేసు…ఉచ్చు పక్కనే ఉచ్చు…ఇదీ కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాజా పరిస్థితి. ఒక పక్క సీబీఐ దర్యాప్తు, మరో పక్క ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. దీంతో భవిష్యత్ ఎలా ఉండబోతుందన్నది అద్దంలో కనిపిస్తున్నట్టు ఫీలైపోతున్నారు. సీబీఐ దర్యాప్తు సాగుతున్నా తన కంపెనీల్లో సోదాలు ముమ్మరం చేసినా పైకి నదురుబెదురు కనిపించకుండా ఓదార్పు యాత్రని కొనసాగిస్తూ వచ్చిన జగన్ కు మంగళవారం  (30-08-11) రాత్రి మరో షాక్ తగిలింది. ఈడీ కూడా చురుగ్గా స్పందించింది. సీబీఐ ఇంతకు ముందు ఎఫ్.ఐ.ఆర్ ను తయారుచేసినట్టుగానే, ఈడీ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (దీన్నే ఇసీఐఆర్ అంటారు) ను నమోదు చేసింది. పైగా, జగన్ ను ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. ఈయనపై పెట్టిన కేసులు కూడా సామాన్యమైనవి కావు. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ – పీఎంఎల్ సీ), విదేశీ ద్రవ్య నిర్వాహక చట్టం (ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్

వినాయక పత్రి – ఆరోగ్య రహస్యం

చిత్రం
వినాయక చవతినాడు 21వ పత్రితో పూజచేయాలి. అయితే, ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. గణపతికి ఏ పత్రాలు ఇష్టమో వాటితోనే పూజించాలేకానీ, ఏ ఆకులు, కొమ్మలు దొరికితే, వాటితో పూజించకూడదు. ఎందుకంటే, ఏనుగులు ఆకులు తింటాయి …. నిజమే. కానీ కొన్ని ఆకులు ముట్టుకోవు. వాటితో పూజిస్తే, వినాయకునికి సంతోషం కలగదు సరికదా… కోపం వస్తుంది. అందుకే, 5amnews.com మీకోసం బొజ్జ గణపయ్యకు ఏ పత్రి ఇష్టమో వాటి గురించీ, వాటిలోని ఆరోగ్య రహస్యం గురించి అందజేస్తున్నది. మరి మీరూ చదవండి… ఏకవింశతి అంటే 21 రకాలు అన్నమాట.వీటి గురించి తెలుసుకుందాం. అంతేకాదు, ఈ పత్రితోనే పూజను సరిపెట్టుకోవాలి. ఆ విషయం మరిచిపోకండి… 1. బృహతి పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. 2. మాచి పత్రం (ధవనం):- ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. 3. బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది. 4. దూర్వ పత్రం (గరికె గడ్డి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది. 5. దత్తుర పత్రం (ఉమ్మేత):- ఊపిరితితులను వ్యకోచింపచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది. 6. బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు. 7. తుర

గ‌వ‌ర్న‌ర్‌గా రోశ‌య్య ప్ర‌మాణ స్వీకారం

చిత్రం
రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన కొణజేటి రోశయ్య.. తమిళనాడు 22 వ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్.. రోశయ్యతో ప్రమాణస్వీకారం చేయించారు. సరిగ్గా రెండేళ్ల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇప్పుడు గవర్నర్ గా పదవీ ప్రమాణం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇదే చివరి పదవి అని చెప్పిన రోశయ్య.. ఇన్నాళ్లూ ఎలాంటి వేషధారణలో ఉన్నారో.. తమిళనాడు గవర్నర్ పదవిలోనూ అదే కట్టూ బొట్టుతో కనబడ్డారు. గవర్నర్ పదవిలో రోశయ్య మొత్తం మారనున్నారని.. సూట్ వేసుకుంటారనే ప్రచారం జరిగింది. కాగా.. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జయలలితతో పాటు.. ఆ రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మన రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు.. అభిమానులు పాల్గొన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, డీఎస్, చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రంజాన్ పండుగ విశిష్ట‌త‌..

చిత్రం
వివేకపు ద్వారాలు తెరచి సౌహార్ద సమభావాల్ని పంచాలనే దైవ ఆదేశాన్ని పాటించడానికి అమలిన హృదయాలతో ఒకరికొకరు సహాయపడాలి. ఇందుకు సామూహిక శక్తి అవసరం. ఈ శక్తిని కలిగించేది నమాజ్‌. దుష్టచింతనల్ని, దురాగ తాల్ని, కుహనా సంస్కారాన్ని నమాజ్‌ ఎదుర్కోగలదు. సత్ప్రవర్తనను నేర్పించ గలదు. ‘సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వ రుని దృష్టిలో అందరికన్నా మిన్న’ (ఖుర్‌ఆన్‌ 49:13) ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్‌ విస్పష్టం చేసింది. నెలరోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈరోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి సుగంధం, పన్నీరు పూసుకొని ‘తక్బీర్‌’ పఠిస్తూ ఈద్‌గాహ్‌ (పండుగ నమాజ్‌ చేసే స్థలం) చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. ‘ఇహ్‌దినస్సిరాతల్‌ ముస్తఖీమ్‌’ (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్‌ పూర్తి అయిన అనంతరం అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువమందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు. హృదయాలు సన్నిహితమవుత

ఈడీ కేసులో అరెస్ట‌యితే..

చిత్రం
వైఎస్ జ‌గ‌న్ ఆస్తుల విష‌యంలో ఇప్ప‌టికే సిబిఐ సోదాలు మ‌మ్మురంగా సాగిస్తున్నాయి. జ‌గ‌న్‌, ఎమ్మార్‌లు చాలా అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు అంచ‌నాకి రావ‌డంతో ఇప్పుడు ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కూడా రంగంలోకి దిగింది.. అత్యంత కఠినమైన అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం-2002 (పీఎంఎల్ఏ), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మంగళవారం జగన్, ఎమ్మార్‌లపై వేర్వేరు కేసులు నమోదు చేసింది. దీంతో జ‌గ‌న్ మ‌రింత చ‌క్ర‌బంధంలో ఇరుక్కున్న‌ట్టే.. ఈ కేసుల్లో అరెస్టయితే… బెయిలు దొరకడమూ కష్టమే! బ్యాంకు ఖాతాల స్తంభన, ఆస్తుల జప్తు… సరేసరి! 2జీ కుంభకోణం కేసులో పలు కంపెనీలకు చెందిన రూ.230 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు, బ్యాంకు ఖాతాల స్తంభనకు ఈడీ మంగళవారమే ఆదేశించింది. జగన్ కేసులోనూ ఇది జరగక తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే… ఈ కేసులో పీఎంఎల్ఏ, ఫెమాల ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ ఇప్పటికే జరిపిన విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించాకే… ఈడీకి కేంద్ర ఆర్థిక శాఖ ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్… ఆర్థిక నేరాల దర్యాప్తునకు సంబంధించిన అత్యున్నత స

ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు

చిత్రం
ముఫ్పైరోజుల పాటు క‌ఠోర ఉప‌వాస దీక్ష చేసి నేడు రంజాన్ పండుగ‌ని జ‌రుపుకుంటున్న ముస్లీం సోద‌ర‌సోద‌రీమ‌ణుల‌కు రంజ‌న్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు. హిందూ ముస్లింలు భాయి, భాయి అన్న నానుడిని అనుస‌రిస్తూ అంద‌రమూ క‌లిసి మెలిసి ఉంటూ ప్ర‌పంచ దేశాల‌కి శాంతి సందేశాన్ని పంపుతుండ‌డం మ‌న భార‌త‌జాతికి ఎంతో గ‌ర్వ‌కార‌ణం. ఇది ఇలాగే కొన‌సాగిస్తూ హిందూ ముస్లింలు ఎప్పుడూ క‌లిసి మెలిసి ఉండాలంటూ మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ… మ‌రొక‌సారి ముస్లిం సోద‌రుల‌కి రంజాన్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు

భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌లో జ‌గ‌న్‌

చిత్రం
భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపేందుకు వై.ఎస్.జగన్ తన సన్నిహితులు,తన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో సెప్టెంబర్ ఒకటిన ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు.తొలుత బుధవారం రాత్రి సమావేశం జరపాలనుకున్నా, దానిని సెప్టెంబరు ఒకటికి వాయిదా వేసుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్వయంగా జగన్ పలువురికి ఫోన్ చేసి హైదరాబాదులో అందుబాటులో ఉండవలసిందిగా కోరడం.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిన నేపధ్యంలో కేసు పూర్వాపరాలను వివరించి తాను ఏమి చేయదలచుకున్నది, అలాగే ఏమి చేస్తే బాగుంటుంది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపై చర్చలు జరపవచ్చు. సెప్టెంబర్ రెండో తేదీన జగన్ ఇడుపులపాయ వెళ్లి తండ్రి రాజశేఖరరెడ్డి వర్ధంతి లో పాల్గొని తిరిగి మరుసటి రోజుకు హైదరాబాద్ వస్తారు.

చిరుకి మ‌రో ప‌రీక్ష పెట్ట‌నున్న కాంగ్రెస్‌

చిత్రం
కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి మరో పరీక్ష పెడతారా? అందుకు రంగం సిద్దం అవుతోందా? కాంగ్రెస్ వర్గాల భావన ప్రకారం జగన్ కు మద్దతుగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన ఇరవైఆరు మంది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే మొత్తం ప్రచార భారం అంతా మెగాస్టార్ చిరంజీవిపై పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆయనకు ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయన సత్తా తేల్చడానికి ఇది ఒక అవకాశంగా కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఉప ఎన్నికలు వస్తే చిరంజీవి కీలకం అవుతారని ప్రచారం కూడా ఆరంభించారు. దానికి కారణం ఏమిటంటే ఈ ఇరవై ఆరు నియోజకవర్గాలలో పందొమ్మిది నియోజకవర్గాలలో ప్రజారాజ్యం పార్టీకి ఇరవైవేలు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. సాధారణ లెక్కల ప్రకారం చూస్తే, గత ఎన్నికలలో కాంగ్రెస్ కు, ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లను లెక్క వేస్తే కాంగ్రెస్ పార్టీ ఆటోమాటిక్ గా గెలవాలి. రాజకీయాలలో ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుందన్న గ్యారంటీ ఉండదు. పైగా జగన్ కు సానుభూతి ఉంటే దాని ప్రభావం అధికంగా సహజంగానే పడుతుంది. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపిలకు డిపాజిట్ పోవడంతో ఆ పార

మేనేజ్‌మెంట్ నాయ‌కా.. వినాయ‌క‌

చిత్రం
గణపతి విఘ్నాలకు అధిపతి. సిద్ధి బుద్ధి ప్రదాత. కార్య నిర్వహణలో తిరుగులేని విజయాన్ని ఇచ్చే వినాయకుడు  నాయకత్వ లక్షణాలకు ప్రతీక. గణపతి విచిత్ర రూపమే మానవ ప్రవర్తనకు దిక్సూచి. విజయానికి దారి చూపే గురి. గణపతి రూపంలో మానవ జాతికి దారి చూపే ప్రతీకాత్మక ‘నాయకత్వ’  విశేషాలేమిటో  తెలుసుకుందాం. పెద్ద  తల: పెద్ద పెద్ద కలలు కనాలని సూచిస్తుంది. చేటంత చెవులు: ‘వినదగునెవ్వరు  చెప్పిన’ ! ఎవరేమి చెప్పినా స్థిమితంగా  వినాలని సూచిస్తాయి. చిన్న కళ్ళు: ఏకాగ్రతను సాధించాలని తెలుపుతాయి. గొడ్డలి: ప్రగతికి ప్రతిబంధకమయ్యే  అనుబంధాలను ఖండించాలి అంటే దూరంగా ఉండాలి. తాడు: అత్యున్నత  లక్ష్యం  వైపు  మిమ్మల్ని లాగుతుంది. చిన్ని నోరు: మితంగా మాట్లాడాలి. ఏక దంతం: మంచిని ఉంచుకుని చెడును విసర్జించాలి. అభయ హస్తం: రక్షణకు చిహ్నం. నాయకుడైనవాడు తన బృందానికి రక్షణ కవచంలా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రగతివైపు పయనించాలని సూచిస్తుంది. వ్యక్తిగత వికాసంనుండి వ్యక్తిత్వ వికాసంవైపు పయనించగలవాడే అభయమివ్వగలడని బోధిస

జ‌గ‌న్‌పై మ‌రో కొత్త కేసు.. ఈడీ కేసు

చిత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు.. ఎమ్మార్ వ్యవహారంపై ఈడీ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా కింద జగన్, ఎమ్మార్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన కొందరు అధికారులు జగన్‌కు కొమ్ము కాస్తున్నారంటూ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు మంగళవారంనాడు ప్రధానికి ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తునకు సంబంధించి ఒక నివేదికను 48 గంటలలో ఇవ్వాలని ప్రధాని కార్యాలయం ఇ.డి.ని ఆదేశించింది. జగన్ కంపెనీలలోకి ధన ప్రవాహం ఎలా జరిగింది, నిధులు ఎక్కడెక్కడినుంచి ఏయే రూపాలలో దారి మళ్లాయన్న అంశాలపై దర్యాప్తు ఇంకా లోతుగా జరగబోతున్నది. ఫెమా సెక్షన్ల క్రింద కూడా ఇ.డి. కేసులు నమోదు చే సింది. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు చాలా వరకు బోగస్ అని సి.బి.ఐ. ఇప్పటికే తేల్చింది.  ఈడీ తన ఎఫ్ఐఆర్ లో జగన్ ను తొలి ముద్దాయిగా పేర్కొంది. సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న 74

పార్టీని కూడా వ‌దులుతారా..?

చిత్రం
అవసరమైతే పార్టీని వదలిపెట్టి కొత్త వేదికను ఏర్పాటు చేసుకుని తెలంగాణ ఉద్యమం చేపడతామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి చెప్పారని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. జానారెడ్డితో తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు దయాకరరావు, మోత్కుపల్లి నరసింహలు, చందర్ రావు తదితరులు బేటీ అయ్యారు. తాము రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని, అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, తద్వారా తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని దయాకరరావు బృందం జానారెడ్డితో వ్యాఖ్యానించింది. దానిపై జానారెడ్డి స్పందిస్తూ, తాను ఒక వ్యూహం ప్రకారం కార్యక్రమం రూపొందిస్తున్నానని, అవసరమైతే పార్టీని వదలి తెలంగాణ ఉద్యమం చేపట్టడానికి కూడా సిద్దమేనని, దానికి టిడిపి నేతలు కూడా సిద్దమా అని జానారెడ్డి ప్రశ్నించారని, అందుకు తాము కూడా సిద్దమేనని స్పష్టం చేశామని దయాకరరావు తెలిపారు.అయితే జానారెడ్డి బాద్యతలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, జానారెడ్డి పార్టీని వదలి వస్తానంటున్నప్పుడు ఇక మంత్రి పదవి గురించి

దూకుడు పార్ట‌న‌ర్ గా ర‌మేష్‌బాబు

చిత్రం
ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరోగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న చిత్రం దూకుడు. ఈ చిత్రం ఆడియో ఇటీవ‌లే విడుద‌ల‌పై సినిమాపై భారీ అంచ‌నాల‌ని పెంచింది. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోన‌ప్ప‌టికీ, విడుద‌ల స‌మ‌యంలో ఈ చిత్రంలో పార్ట‌న‌ర్‌గా మ‌హేష్‌బాబు అన్న‌య్య ర‌మేష్‌బాబు చేరుతున్న‌ట్టు స‌మాచారం. త‌మ్ముడు మ‌హేష్‌బాబుతో భారీ బ‌డ్జెట్‌తో అత‌థి, అర్జున్ చిత్రాలు నిర్మించి చేతులు కాల్చుకోవ‌డం తెలిసిందే.. అయితే దూకుడు స‌క్సెస్‌పై మ‌హేష్‌బాబు విశ్వాసంగా ఉండ‌టంతో ఈ చిత్రం స‌క్సెస్ సాధించి కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌ని ఊహించి న‌ష్టాల్లో ఉన్న త‌న బ్ర‌ద‌ర్ ర‌మేష్‌ని ఈ చిత్రంలో పార్ట‌న‌ర్‌గా చేర్చేందుకు ప్ర‌య‌త్న‌స్తున్న‌ట్టు వినికిడి. గ‌తంలో పూరి జ‌గ‌న్నాథ్ నిర్మించి సెన్సేష‌న‌ల్ మూవీ పోకిర‌లో కూడా త‌న సోద‌రి మంజుల పార్ట‌న‌ర్‌గా చేరి లాభాల‌ను కూడ‌గ‌ట్టుకోవ‌డం తెలిసిందే.. సో.. ఇప్పుడు ర‌మేష్‌ని కూడా లాభాల్లోకి తీసుకురావ‌డానికి మ‌హేష్ న‌డుంబింగించాడ‌ని తెలుస్తోంది.

జైబోలో తెలంగాణ‌కి ద‌క్కిన గౌర‌వం..

చిత్రం
ప్ర‌తిష్టాత్మ‌క సౌత్ ఏసియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో తెలంగాణ క‌థాంశంతో తీసిన జై భోలో తెలంగాణ చిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌కి ఎంపిక‌య్యింది. సౌత్ ఆసియాలోని 8 దేశ‌ల‌లో నిర్మించిన 50 చిత్రాల‌ని ఎంపిక చేసి ఈ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శిస్తారు. ఎన్నో చిత్రాల‌ని ప‌రిశీలించిన త‌ర్వాత అత్యుత్త‌మంగా అనిపించే యాభై చిత్రాల‌కి ఈ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి అర్హ‌త ల‌భిస్తుంది.. ఆ యాభై చిత్రాల‌లో జై భోలో తెలంగాణ చిత్రం ఒక‌టి కావ‌డం విశేషం. ప్ర‌త్యేక తెలంగాణ కోసం అర‌వై ఏళ్ళుగా సాగుతున్న ఉద్య‌మం నేప‌థ్యంలో సాగిన ఈ చిత్రంలో తెలంగాణ‌ అమ‌ర వీరులని స్పృషిస్తూ, ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థిత‌ల‌కి అనుగుణంగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మ‌లిచారు. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి విజ‌యాన్ని సాధించడ‌మే కాకుండా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఎస్ ఏ ఎఫ్ ఎఫ్ ఫెస్టివ‌ల్‌కి ఎంపిక కావ‌డం ప‌ట్ల ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఎన్‌. శంక‌ర్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల విజ‌య‌మే కాకుండా తెలుగు వారంద‌రి విజ‌యంగా ఆయ‌న చెప్పారు. సౌత్

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం త‌ర్వాతే ఆడియో..

చిత్రం
ఎన్టీఆర్‌, సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌ కంగా రూపొందుతున్న చిత్రం ఊస‌ర‌వెళ్ళి. కిక్ విజ‌యం ఇచ్చిన కిక్‌తో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ఊపుమీద ఉండ‌గా, శ‌క్తి ఇచ్చిన ఘోర‌ప‌రాజ‌యం షాక్‌లో ఎన్టీఆర్ ఉన్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న‌ల్ వ‌స్తున్న ఊస‌ర‌వెళ్ళిపై స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పైగా ఊస‌ర‌వెళ్ళి అన‌గానే నెగెటివ్ ఫీలింగ్ క‌లిగించే టైటిల్ ఇది.. మ‌రి ఈ టైటిల్‌ని బ‌ట్టే సినిమాలో ఎన్టీఆర్‌ని ఎన్ని రంగులు మారుస్తూ (షేడ్స్‌) చూపిస్తాడో చూడాల్సింది. పైగా ఈ చిత్రం క‌థ కూడా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని, గ‌జిని సినిమాలాంటి పాయింట్‌నే ఈ సినిమాలో తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్‌కి ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం ప్ర‌స్తుతం ఎంతో అవ‌స‌రం. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబ‌ర్ 11న రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. అయితే ఆ రోజు గ‌ణేష్ నిమ‌జ్జ‌నోత్స‌వం ఉండ‌డంతో ఆడియో రిలీజ్‌ని 12వ తేదీకి పోస్ట్‌పోన్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించ‌గా భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నార