రాయ‌ల‌సీమ బిడ్డ‌ని.. ఖ‌బ‌డ్దార్‌..



నేనూ రాయ‌ల‌సీమ బిడ్డ‌నే.. తిరుప‌తిలో పుట్టి, తిరుప‌తిలోనే పెరిగిన వాడిని.. అంటూ ఘాటుగా మాట్లాడారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న సోమ‌వారం నాడు తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. అన్నాహ‌జారే అవినీతి ఉద్య‌మానికి సంఘీభావం చెప్తూ ఆయ‌న తిరుప‌తిలో ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు అడ్డు చెప్పారు. చంద్ర‌బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. అవినీతికి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు ఉద్య‌మం చేయ‌డం ఏంట‌ని ఎద్దేవా చేశారు. సాఫీగా సాగిపో్తున్న ఈ కార్య‌క్ర‌మం వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చేసిన హ‌ల‌చ‌ల్‌తో ఉద్రిక్త‌ల‌కి దారితీసింది. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై లాఠీచార్జి చేయ‌డంతో వారు అక్క‌డినుండి వెళ్ళిపోయారు. అయితే అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ని రూ. 10 కోట్లు ఇచ్చి త‌న పార్టీలోకి తీసుకుంటున్నార‌ని, వైఎస్ విజ‌య‌మ్మ ప్ర‌ధాన‌మంత్రికి రాసిన లేఖ‌లో త‌న భ‌ర్త‌గానీ, త‌న కుమారుడు గానీ అవినీతికి ప‌ల్ప‌డ‌లేద‌ని చెప్ప‌లేద‌ని, దీంతోనే వారు అవినీతికి పాల్ప‌డింది అర్థ‌మ‌వుతోంద‌ని చంద్ర‌బాబు ద్వ‌జ‌మెత్తారు. తాను త‌న కుమారుడితో క‌లిసి మూడు బెడ్‌రూంలు క‌లిగిన ఇంటిలోనే ఉంటున్నాన‌ని, కానీ జ‌గ‌న్ బెంగుళూరు తోపాటు త‌దిత‌ర ప్రాంతాల‌లో పెద్ద ప్యాలెస్ క‌ట్టుకుని మ‌హారాజులా బ్ర‌తుకుతున్నాడ‌ని ఇదంతా ప్ర‌జ‌ల సొమ్మేన‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!