చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల నిశ్చితార్థం త్వర‌లో


మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు పెళ్లి గురించి ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన చేశారు.మీడియాలో రకరకాలు కధనాలు వస్తున్న నేపధ్యంలో చిరంజీవి ఒక వారంలో రామ్ చరణ్ తేజ, ఉపాసనల వివాహ నిశ్చితార్ధం గురించి తేదీని చెబుతానన్నారు. వచ్చే నెల రెండో తేదీలోగా నిశ్చితార్దం ఉంటుందని ఆయన తెలిపారు.కాగా హైదరాబాద్ మేయర్ బండ కార్తీక్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కలిసి రాఖీ కట్టారు. రాజీవ్ గాందీ పుట్టిన రోజున తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని, తన పుట్టిన రోజు అయిన ఆగస్టు ఇరవైరెండున కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేస్తానని చిరంజీవి తెలిపారు.ప్రస్తుతానికి చిరంజీవి రాజకీయ వార్తల కంటే ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ వివాహానికి సంబందించిన వార్తలపైనే జనానికి క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలలో మళ్లీ ఏదైనా ఘనత సాధించేవరకు ఆయన కాస్త వెనకబడే ఉంటారు.తర్వాత కాంగ్రెస్ లో పుంజుకుని ఆ రాజకీయాలలో ముందుకు వస్తే అప్పుడు ప్రాముఖ్యత పెరుగుతుంది.అపోలో ఆస్పత్రి గ్రూపు అధినేత ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అయిన కామినేని ఉపాసనతో చిరంజీవి కుమారుడి వివాహం ఖాయమైన సంగతి తెలిసిందే.సహజంగానే సినీ నటుల వ్యక్తిగత విశేషాలు తెలుసుకోవడానికి ప్రజలలో కుతూహలం అధికంగా ఉంటుంది ప్రస్తుతానికి దానికే గిరాకి అనిచెప్పాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!