అవినీతి పోరాటంలో ఒక‌రు బ‌లి..!


అన్నా హ‌జారే దీక్ష‌ని పోలీసులు భ‌గ్నం చేయ‌డం, కేంద్ర ప్ర‌భుత్వం రాజ‌కీయ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించి అన్నా హ‌జారేను క‌ట‌క‌టాల పాలు చేయ‌డంతో దేశం ఒక్క‌సారిగా అన్నా హ‌జారేకు మ‌ద్ద‌తుగా ముందుకు సాగుతోంది. ప్రాంతాలు, మ‌తాల‌క‌తీతంగా అవినీతిపై స‌మ‌ర‌శంఖం పూరించింది. ఈ అవినీతి పోరాటంలో పోలీసుల తూటాల‌కి ఓ వ్య‌క్తి బ‌ల‌వ్వ‌డం ఎంతో బాధాక‌రం.  మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అన్నాహజారే మద్దతుదారుడిని పోలీసులు కాల్చి చంపి చ‌పారు. షీలామసూద్ అనే వ్యక్తిపైపోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి చంపినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌తో అవినీతి వ్య‌తిరేక పోరాటం కోసం చేస్తున్న అన్నా హ‌జారేకి మ‌రింత మ‌ద్ద‌తు ల‌భించ‌డ‌మే కాదు.. కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై నిర‌స‌న‌వెలువెత్తుతంది. మ‌రి.. ఈ ప‌రిణామాలు ఎలాంటి ప‌రిస్థితుల‌కి దారితీస్తాయో…

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!