జ‌గ‌న్ సోద‌రి ఇంటిపైనా దాడులు


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా ఇంటిపై కూడా సిబిఐ దాడులు జరిగాయి. అలాగే గాయత్రి హిల్స్ లో హెటిరో డ్రగ్స్ కాంగ్రెస్ పార్టీ కోర్టులను అడ్డం పెట్టుకుని ఈ దాడులకు పాల్పడుతోందని, ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ఇన్ని కుట్రలు పన్నుతున్నారని వైఎస్.ఆర్.కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ప్రజలంతా చూస్తున్నారని, ప్రజలు కాంగ్రెస్ కు తగు సమయంలో బుద్ది చెబుతారని శోభ హెచ్చరించారు. కాగా మరో నాయకుడు గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ శంకరరావు వేసింది రాజకీయ లేఖ కాదా అని ప్రశ్నించారు. కోర్టులను గౌరవిస్తామని అంటూనే, సిబిఐ తీరుపై , కాంగ్రెస్ పార్టీపై వారు విరుచుకుపడ్డారు.కాగా సాయంత్రం వరకు ఈ సోదాలు జరుగుతాయని అంటున్నారు. ఉదయం పది గంటలవరకు ఇరవై రెండు చోట్ల సిబిఐ దాడులు చేసింది.కూకట్ పల్లి ఇందూ ప్రాజెక్ట్స్ కార్యాలయంపై , అలాగే వ్యాపారవేత్త లక్ష్మీరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరుల ఇళ్లపై కూడా సోదాలు చేశారు హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉన్న జగన్ ఇంటిలో కూడా సోదాలు జరుగుతున్నాయి.జగన్ కు చెందిన ముంబై కార్యాలయంపై కూడా దాడి చేశారు.వై.ఎస్.జగన్ భార్య భారతితోపాటు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనీల్ లను కూడా సిబిఐ విచారిస్తుందని చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!