భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌లో జ‌గ‌న్‌


భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపేందుకు వై.ఎస్.జగన్ తన సన్నిహితులు,తన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో సెప్టెంబర్ ఒకటిన ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు.తొలుత బుధవారం రాత్రి సమావేశం జరపాలనుకున్నా, దానిని సెప్టెంబరు ఒకటికి వాయిదా వేసుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్వయంగా జగన్ పలువురికి ఫోన్ చేసి హైదరాబాదులో అందుబాటులో ఉండవలసిందిగా కోరడం.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిన నేపధ్యంలో కేసు పూర్వాపరాలను వివరించి తాను ఏమి చేయదలచుకున్నది, అలాగే ఏమి చేస్తే బాగుంటుంది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపై చర్చలు జరపవచ్చు. సెప్టెంబర్ రెండో తేదీన జగన్ ఇడుపులపాయ వెళ్లి తండ్రి రాజశేఖరరెడ్డి వర్ధంతి లో పాల్గొని తిరిగి మరుసటి రోజుకు హైదరాబాద్ వస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!