గ‌వ‌ర్న‌ర్‌గా రోశ‌య్య ప్ర‌మాణ స్వీకారం


రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన కొణజేటి రోశయ్య.. తమిళనాడు 22 వ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్.. రోశయ్యతో ప్రమాణస్వీకారం చేయించారు. సరిగ్గా రెండేళ్ల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇప్పుడు గవర్నర్ గా పదవీ ప్రమాణం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇదే చివరి పదవి అని చెప్పిన రోశయ్య.. ఇన్నాళ్లూ ఎలాంటి వేషధారణలో ఉన్నారో.. తమిళనాడు గవర్నర్ పదవిలోనూ అదే కట్టూ బొట్టుతో కనబడ్డారు. గవర్నర్ పదవిలో రోశయ్య మొత్తం మారనున్నారని.. సూట్ వేసుకుంటారనే ప్రచారం జరిగింది. కాగా.. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జయలలితతో పాటు.. ఆ రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మన రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు.. అభిమానులు పాల్గొన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, డీఎస్, చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!