ప్రాణాలైనా అర్పిస్తాం..


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే తన ప్రాణాలిచ్చేందుకు కూడా సిద్ధమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. బెదిరింపులకు.. భయపడేది లేదని.. ఉద్యమం నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని ఈటెల అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో కావాలనే కొందరు సీమాంధ్ర నేతలను తనని టార్గెట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. తనపై కొందరు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. కుల మతాలకు అతీతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు.. కొందరు సీమాంధ్రులు అణిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఈటెల అన్నారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా.. ఉద్యమం ఇంకా ఉధృతంగా సాగుతుందని ఆయన హెచ్చరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!