కిర‌ణ్‌కుమార్‌కి ప‌ద‌వీ గండం..


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి నవంబరులో గండం ఉంటుందా?కొందరు జ్యోతిష్కులు చెబుతున్నదాని ప్రకారం నవంబర్ పదహారు మధ్యాహ్నం రెండు న్నర గంటలకు కిరణ్ ప్రభుత్వం గండంలో పడుతుందని ఖమ్మం కు చెందిన జ్యోతిష్కుడు నరసింహాచార్యులు చెబుతు న్నారు. జగన్ భవితవ్యం, విజయమ్మ నాయకత్వం తదితర అంశాలపై ఎన్టీవిలో చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు నెలలపాటు జగన్ కు కష్టాలు ఉంటాయని, ఆ తర్వాత అంతా మహర్దశ అని ఆయన అన్నారు.సోనియాగాంధీ,జగన్ ఇద్దరూ ఆరుద్ర నక్షత్రంలో జన్మించారని, ప్రస్తుతం ఇద్దరూ కూడా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు.వచ్చే ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. రాజశేఖరరెడ్డికి ప్రాణ గండం ఉందని తాను గతంలో చెప్పానని, అది వాస్తవమని ఆ తర్వాత తేలిందని నరసింహాచర్యలు చెప్పారు. మరో జ్యోతిష్కుడు శర్మ కూడా ఈ చర్చలో పాల్గొంటూ సెప్టంబరు పదహారు తర్వాత జగన్ కు అంతా మంచే జరుగుతుందని చెప్పారు.జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు తక్కువ అని కూడా వీరు అంటున్నారు. మొత్తం మీద రాజకీయంగా ఎలా ఉన్న జ్యోతిష్కుల పరంగా జగన్ కు మంచి ఆశాజనక పరిస్థితే కనిపిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!