ఈడీ కేసులో అరెస్టయితే..

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… ఆర్థిక నేరాల దర్యాప్తునకు సంబంధించిన అత్యున్నత సంస్థ. ఇది కేంద్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణలో పనిచేస్తుంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా సీబీఐ విచారణతోనే ముచ్చెమటలు కక్కుతున్నారు. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో వీరికి మరిన్ని కష్టాలు తప్పవని తెలుస్తోంది. జగన్ కంపెనీలలో సిబిఐ సోదాలు జరుగుతున్నప్పటికీ జగన్ మాత్రం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ప్రజల మధ్యనే ఉంటూ తనపై పెట్టిన కేసులు కక్షసాధింపు చర్యే అని దయ్యబడుతున్నారు. తాజాగా ఈడీ కేసులు కూడా నమోదు కావడంతో జగన్ వ్యూహం ఎలా ఉండబోతోంది. ఈడీ కేసులో జగన్ జైలుకి వెళ్ళడం అనివార్యమేనా..? ఒకవేళ జగన్ జైలుకెళ్ళాల్సి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? అని ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి