తెలంగాణ‌లో జ‌గ‌న్ యాత్ర


తెలంగాణలో మొదటిసారిగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు వై.ఎస్.జగన్ రైతు దీక్షను చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఈ నెల పదో తేదీనుంచి మూడు రోజులపాటు ఈ దీక్ష జరుగుతుందని ఆ పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్దన్ ప్రకటించారు. తెలంగాణ రైతులంతా దీనిని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఉద్యమం చేపట్టిన జగన్ ఆ తర్వాత తెలంగాణ జిల్లాలలో ఎక్కడా పెద్దగా పర్యటించలేదు. గతంలో వరంగల్ జిల్లాలో ఓదార్పుయాత్రను చేపట్టడానికి రైలులో మహబూబాబాద్ వెళుతుండగా , ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఆనాటి ప్రభుత్వం జగన్ ను అరెస్టు చేసి వెనక్కి తీసుకువచ్చింది. తదుపరి తెలంగాణలో పూర్తిస్థాయి ఉద్యమ కార్యక్రమానికి వెళ్లడం ఇదే మొదలు అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం విజయవంతం అయితే తెలంగాణ జిల్లాలలో జగన్ స్వేచ్చగా ఓదార్పుయాత్ర, ఇతర పర్యటనలు చేయగలుగుతారు. అందుకు ప్రాతిపదికగానే జగన్ ఈ పర్యటన చేపడుతున్నారని బావించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!