శ్రీకృష్ణకమిటీపై హరీష్ రావు, కిషన్ రెడ్డి చురకలు

శ్రీకష్ణకమిటీ ఎనిమిదో అధ్యాయం రాష్ట్రంలో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇంతకాలం రహస్యంగా ఉన్న నివేదికలోని ఎనిమిదో అధ్యాయంలోని ముఖ్యాంశాలను జస్టిస్ నర్సింహారెడ్డి బట్టబయలు చేయడంతో పలువిషయాలు వెలుగులోకి వచ్చాయి. అవన్నీ తెలంగాణవాదానికి, తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు వ్యతిరేకంగా ఉండటంతో తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.
టీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు:
     శ్రీకృష్ణకమిటీ అమ్ముడుపోయిందని రుజువైంది.  దీనిపై న్యాయపోరాటం చేస్తాం , కమిటీ సభ్యులకు శిక్ష పడేలా చేస్తాం.
 బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, బీజేఎల్పీ నేత అయిన జి.కిషన్‌రెడ్డి:
   శ్రీకృష్ణకమిటీ రిపోర్టును బీజేపీ రాష్ట్రకార్యాలయంలో చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాదు.దీనికి అంతకుమించి విలువ లేదు.
కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి :
      శ్రీకృష్ణకమిటీకి అయిన ఖర్చును ఆ సభ్యుల నుంచే రాబట్టాలి. ప్రజాధనాన్ని వృథా చేశారు.
 కరీంనగర్ ఎంపీ పొన్నంప్రభాకర్:
    శ్రీకృష్ణకమిటీ ఓ కన్సల్టెన్సీ మాదిరిగా పనిచేసింది. సీమాంధ్రనేతలకు అమ్ముడుపోయింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!