సీమాంధ్రఎంపీలతో కలిసికూర్చోం - టి-కాంగ్రెస్ ఎంపీలు


సీమాంధ్ర,తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య సయోధ్యకు గులాంనబీ అజాద్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ముందు వేర్వేరుగా సమావేశపరిచి, ఆ తరువాత ఇద్దర్ని కలిసి కూర్చోపెట్టి సమావేశం జరపాలని గులాంనబీఅజాద్ భావించారు. తదనుగుణంగా శుక్రువారం నాడు ముందుగా తెలంగాణ ఎంపీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, శ్రీకృష్ణకమిటీ ఎనిమిదో అధ్యాయంలో పొందపర్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను మేనేజ్ చేయాలన్న వ్యాఖ్య తమను ఇబ్బంది పెడుతుందని వారు వ్యాఖ్యానించారు. ఆ తరువాత సీమాంధ్ర ఎంపీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తే తాము హాజరుకాలేమని వారు చెప్పడంతో బిత్తెరపోవడం అజాద్ వంతయింది. ఈ సమావేశం పూర్తికాగానే బయటకు వచ్చిన మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలతో కలిసి కూర్చోమని నిక్కచ్చిగా చెప్పేశామని వెల్లడించారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లోనే కలుసుకోవడం లేదు అలాంటప్పుడు అజాద్‌ దగ్గర కలిసి కూర్చోవడం, చెట్టపట్టాల్ వేసుకోవడం ఎలా జరుగుతాయి? , అలాగే కలిసి ఫోటోలు ఎలా దిగుతాం..మా మనసు ఒప్పుకోవడం లేదు. 600మంది బలిదానంతో త్యాగాలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోతాం..అందుకే కలిసి కూర్చోలేమని చెప్పేశామని సర్వే సత్యనారాయణ వివరించారు. మే నెల వరకు అధిష్టానం ఆగమన్నది కనుకే ఆగామని కూడా ఆయన చెప్పారు. దీంతో గులాంనబీఅజాద్‌కు తెలంగాణ ఎంపీల నుంచి మొదటి షాక్‌ ఎదురయినట్లు లెక్క. ఆ తరువాత సీమాంధ్రఎంపీలతో భేటీ అయ్యారు. అజాద్‌కు కూడా తెలంగాణ అంశం ఓ పరీక్షగా మారింది.
- కొమ్మినేని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!