ఉస్మానియా విద్యార్ధుల కష్టాలు


ఒక పక్క ఉస్మానియా యూనివర్శిటీలో పరీక్షల మూడ్ వస్తుంటే, మరో పక్క యూనివర్శిటీలోకి ఆర్టీసి బస్ లు రాకపోవడంతో విద్యార్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఆయా పి.జి,తదితర వృత్తివిద్య కోర్సులకు సంబందించి వందలాదిమంది విద్యార్ధులు సెమిస్టర్ పరీక్షలు ఆరంభమవుతున్నాయి. కొంతకాలం క్రితం పరీక్షలు రాయబోమని, లేదా వాయిదా వేయాలని డిమాండు చేస్తూ ఆందోళనలు జరిగేవి. ఇప్పుడు అవన్ని సద్దుమణిగి పరీక్షలకు విద్యార్ధులు తయారవుతున్నారు.కాని ఇలాంటి సమయంలో బస్ లు తిరగకపోవడంతో మండుటెండల్లో విద్యార్ధులుచెమటలు కక్కుతూ రెండు,మూడు కిలోమీటర్లు నడవవలసి వస్తోంది. దీనికి కారణం గతంలో ఉస్మానియా వర్శీటీలో ఐదు బస్ లను దహనం చేయడం, సుమారు ముప్పై బస్ ల అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేయడం వంటివాటివల్ల ఆర్టీసి బస్ లను నడపడం లేదు. బస్ లను నడపడానికి పోలీసులు అనుమతించి రక్షణ కల్పిస్తే బస్ లు నడుపుతామని ఆర్టీసి చెబుతుంటే,పోలీసులు విద్యార్ధి నాయకులు కనుక బస్ లకు నష్టం చేయమని హామీ ఇస్తే అనుమతి ఇస్తామని లేకుంటే కష్టమని చెప్పారు. దీనిపై ఆందోళనలకు నాయకత్వం వహంచే వారిని అడిగితే తాము అలాంటి హామీ ఇవ్వలేమని, తెలంగాణ రావడం తమకు ముఖ్యమని చెబుతున్నారు. యూనివర్శిటీలో బస్ లను ధ్వంస చేసినందువల్ల ఆరీ్టీసికి సుమారు ఏభై లక్షల నష్టం వాటిల్లింది.ఈ పరిస్థితిలో వాహనాలు ఉన్న వారు ఇబ్బంది లేకుండా తిరుగుతున్నారు. మరి వాహనాలు లేని విద్యార్ధుల గతి ఏమిటి?ఎండలలో కష్టాలు పడవలసిందేనా?

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!