తిరుమలలో తమిళ రాజకీయ డబ్బు ...గోవిందా...




రాజకీయనాయకులకు భలే ఐడియాలు వస్తాయి.చట్టాలు వారే చేస్తారు. వాటిని ఎలా ఉల్లంఘించాలో ప్రణాళికలు కూడా వారే తయార చేస్తారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఆరంభం కావడంతోనే ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి రావడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబ్బు దిగుమతి చేసుకోవడం, పంపిణీ చేయడం కష్టం అనుకున్నట్లున్నారు రాజకీయ జీవులు. దాంతో వారికో ఐడియా వచ్చింది.తమిళనాడు సరిహద్దుకు దగ్గరలో ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం ఈ ఆర్ధిక లావాదేవీలకు మంచి అనువైన ప్రదేశంగా గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి డబ్బును పెద్ద మొత్తాలలో తిరుమల తెప్పించుకుంటున్నారు. ఏ కారణం వల్ల పోలీసుల కంట పడితే, దేవుడి హుండిలో వేయడానికి తెచ్చామని చెప్పి తప్పించుకోవచ్చన్నది వారి వ్యూహమట.తదనుగుణంగానే వారు ఆ స్కీమ్ ను అమలు చేయడం ఆరంభించారు. ఎవరూ గమనించకపోతే తమిళనాడు నుంచి పదిహేను మందితో కూడిన బృందం కూడా తిరుమలకు ఈలోగా చేరుకుంటుంది. ఆ పెద్ద మొత్తాన్ని చిన్నమొత్తాలుగా విడదీసి వారికి పంపిణీ చేసి వారిద్వారా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారట.అయినా కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో పట్టుకుంటే సుమారు అరవైనాలుగు లక్షల రూపాయల మొత్తం దొరికింది. అంటే అప్పటికే ఎంత మొత్తం తమిళనాడులోని ఆయా నియోజకవర్గాలకు చేరిందో ఊహించుకోవచ్చని చెబుతున్నారు.తమిళనాడు నిఘా విభాగం ఈ విషయం కనిపెట్టి సంబంధిత వర్గాలకు ఉప్పందించడంతో రాజకీయ నేతలు అమలు చేస్తున్న ఈ కొత్త స్కీమ్ విషయం వెలుగులోకి వచ్చింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!