జయలలిత కోసం చంద్రబాబు

 
మన రాష్ట్రనేతలు చంద్రబాబు,చిరంజీవి ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో పోటాపోటీగా ప్రచారం చేయబోతున్నారు. శాసనసభ లాబీల్లో చంద్రబాబు, చిరంజీవి ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. తనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమిళనాడు, పాండిచ్చేరిల్లో ప్రచారం చేయాలని కోరిందని, ఆ తరువాత పశ్చిమబెంగాల్‌కు వెళ్తానని చిరంజీవి చెప్పారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ తాను కూడా తమిళనాడు పర్యటనకు వస్తున్నానని, కాకపోతే మీకు వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేయబోతున్నానని వెల్లడించారు, నిజానికి చంద్రబాబుకి తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె నేత కరుణానిధితో మంచి సంబంధాలున్నాయి. ఒకరంటే ఒకరికి పరస్పరం గౌరవం కూడా ఉంది. యునైటెడ్ ఫ్రంట్ హయాంలోనూ , ఎన్డీఎ హయాంలో కూడా వీరు మిత్రపక్షాలుగా జాతీయస్థాయిలో పనిచేశారు, అంతేకాక కరుణానిదికి , ఎన్టీఆర్‌కు కూడా గతంలో స్నేహం ఉండేది, కరుణానిధి స్వయంగా 1987లో జరిగిన విజయవాడ మహానాడులో కూడా పాల్గొని ప్రసంగించారు. కానీ 2004లో బేజేపీతే విబేధించి డిఎంకె కాంగ్రెస్‌వైపు మళ్లడంతో చంద్రబాబుకి కాస్త ఇబ్బందిగా మారి డిఎంకెతో సంబంధాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇక జయలలితతో స్నేహసంబంధాలు అంతంతమాత్రమే. ఒక సందర్భంలో జయలలిత, చంద్రబాబుతో మరికొన్ని చిన్నపార్టీలు సమావేశమై మూడోఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్నా మొగ్గలోనే ముగిసిపోయింది. కారణమేదైనప్పటికీ ప్రస్తుతం జయలలిత చంద్రబాబును తనకు మద్ధతుగా ప్రచారానికి ఆహ్మానించినట్లున్నారు. అక్కడికి వెళ్లి ఆయన డిఎంకెని తిట్టగలుగుతారా అన్న ప్రశ్న కూడా ఉంది. అందుకే బహుశా ఆయన కాంగ్రెస్‌నే టార్గెట్‌గా చేస్తూ ప్రచారం చేయవచ్చు, కానీ జయలలితకు డిఎంకెని, కరుణానిధిని విమర్శించడం అవసరం. మరి చంద్రబాబు ఆ పని చేయగల్గుతారా అన్నది ప్రశ్న.
                                                                                                                           - కొమ్మినేని
                                                                                                                          (kommineni.info)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!