భారత్‌-పాక్‌లలో ఎవరు గెలవాలో చెప్పమ్మా...సానియా


 వచ్చే బుధవారం (మార్చి 30) నాడు మొహాలీలో  జరిగే భారత్‌- పాకిస్థాన్ సెమీస్ మ్యాచ్ సానియామీర్జాలో టెన్షన్‌ రేపుతోంది. దాయాదులు పోరు కావడం, అందులో ఒకటి అమ్మగారిది, మరొకరిది అత్తగారి దేశం. ఏ రంగంలో చూసిన శత్రుత్వం పెంచుకున్న ఇరు దేశాలు ప్రపంచకప్‌లో తలపడుతుండటం, వీరిలో ఎవరికి మద్ధతు తెల్పాలన్నదానిపై గత ఏడాది పాకిస్థానీ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జాకు గుబులురేపుతోంది. మరో వైపు తన భర్త షోయబ్‌మాలిక్‌ పాకిస్థాన్‌ క్రికెటర్ కావడం , తను ఇప్పటికీ టెన్నిస్‌లో భారత్‌కే ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఇరువైపులా టెన్షన్ ఉండటంతో ఆమె ఆచితూచి స్పందించింది. ఏది ఏమైనా నా సొంత దేశం భారత్‌ జట్టు గెలవాలని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్‌ విజయం ఖాయమని తన భర్త షోయబ్‌మాలిక్ తన సందేశంలో పేర్కొన్నారు. ణరి ఇరువురిలో ఎవరి మాట నెగ్గుతుందో..ఎవరి కోరిక నెగ్గుతుందో బుధవారం వరకు వేచిచూడాల్సిందే..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!