జపాన్ చిన్నారుల కోసం వాటర్ బాటిల్ పంపించండి

 

ఈ చిన్నారులకు ఎంత కష్టం వచ్చింది. ఆడుతూపాడుతూ ఎగిరే వయసులో రేడియేషన్ భూతం విరుచుకుపడింది. టాప్ లో నుంచి వచ్చే మంచినీళ్లలో కూడా రేడియేషన్ ప్రభావం ఉన్నట్టు జపాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి నీళ్లు తాగితే మరీ ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్ అంధకారం అవుతుందని అంతా భయపడుతున్నారు. ఇప్పటికే అనేక దేశాలు జపాన్ చిన్నారుల కోసం మంచినీళ్ల బాటిల్స్ పంపిస్తున్నాయి. మరి మీరు కూడా కనీసం ఒ లీటర్ బాటిల్ ను టోక్యోకి పంపించండి.....

    పెను భూకంపం సృష్టించిన ప్రళయ సునామీ దెబ్బకు కకావికలమై.. అణు సంక్షోభానికి దారి తీసిన జపాన్‌లో ప్రజలు భయంతో మగ్గుతున్నారు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని బద్దలు కొట్టుకుని.. సమీప ప్రాంతాలను చుట్టుముట్టేసిన రేడియేషన్, ఇప్పుడు టోక్యో నగరాన్నీ కమ్మేస్తోంది.

ఇళ్లలోనే ఉండాలని, కిటీకీలు గట్టిగా బిగించుకోవాలని చేసిన హెచ్చరిక గుబులు పుట్టిస్తోంది. మరోవైపు.. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో రియాక్టర్‌లను చల్లబర్చే పని తీవ్రస్థాయిలో సాగుతోంది. వీటి నుంచి వెలువడిన రేడియేషన్ వాతావరణాన్ని, జలాలను కలుషితం చేసింది. నీటిశుద్ధి ప్లాంటులు రేడియేషన్‌కు గురికావడంతో పంపుల ద్వారా సరఫరా అయ్యే నీరు చిన్నారులకు శ్రేయస్కరం కాద ని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో దేశ వాసులు స్టోర్‌లలోని బాటిల్డ్ వాటర్‌ను ఖాళీ చేశారు.

టోక్యోలో పసిబిడ్డల కోసం 2.40 లక్షల మంచినీటి బాటిళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జపాన్ చిన్నారుల కోసం భారత్ సుమారు పది వేల లీటర్ల మంచినీటి బాటిళ్లను పంపింది. జపాన్‌లోని ఆహార పదార్థాలకు కూడా రేడియేషన్ పాకడంతో ఆ దేశ ఉత్పత్తులను అమెరికా నిలిపేసింది. కాగా, జపాన్‌లో ప్రళయం వల్ల కలిగిన నష్టాన్ని రూ.13 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. తమ దేశంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్షలు నిర్వహించేందుకు అమెరికా సిద్ధమవుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!