పులివెందుల నుంచి కాంగ్రెస్ తప్పుకున్నట్లేనా?


పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తన అభ్యర్దిని రంగంలో దించాలా?వద్దా అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతోంది.మేనెల ఎనిమిదో తేదీన కడప లోక్ సభ , పులివెందుల శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వై.ఎస్‌.విజయలక్ష్మి పోటీచేయనున్నారు. వారికి ప్రత్యర్దులుగా ఎవరిని నిలపాలన్నదానిపై కాంగ్రెస్ లో తర్జనభర్జనలు పడుతోంది. రాజశేఖరరెడ్డిపై గౌరవంతో ఈసారి కూడా పులివెందులలో ఆయన భార్యకు పోటీ పెట్టకుండా వదిలేస్తే ఎలా ఉంటుదన్నదానిపై ఆలోచన సాగుతోంది.కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు సూచనప్రాయంగా వెల్లడించారు. దానిని నిజం చేసే దిశగానే అడుగులు పడుతున్నాయని అంటున్నారు
    అయితే ఇది కాంగ్రెస్, జగన్ పార్టీల మేచ్ ఫిక్సింగ్ అని టిడిపి ఆరోపించడానికి సిద్దమవుతోంది.అయినప్పటికీ తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవలసింది జగన్ పోటీచేస్తున్న కడప లోక్ సభ నియోజకవర్గంపై అని కాంగ్రెస్ నాయకత్వం అబిప్రాయపడుతోంది. కాగా జగన్ పై పోటీచేయడానికి ఉర్రూతలూగుతున్న తప అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని వెంటబెట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి ముఖ్యమంత్రిని గురువారం నాడు కలిశారు. పులివెందులలో పోటీచేయకపోవడం వల్ల లాభం కలుగుతుందా? లేదా అన్నదానిపై కాంగ్రెస్ అంచనా వేస్తోంది.పులివెందులలో ఎటూ గెలిచే అవకాశం తక్కువ కనుక ఆ విధంగా చేస్తే రెండు విధాలుగా ఉపయోగం ఉంటుందని కొందరు నేతలు అబిప్రాయపడుతున్నారు.పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కడప జిల్లా నేతలతో చర్చించి ఆయన ముఖ్యమంత్రితో కలసి అదిష్టానంతో కూడా మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!