ఉప్పు స‌త్యాగ్రహం ఉద్యమం స్థాయి తెలంగాణ ఉద్యమానిది..


ఉప్పు సత్యాగ్రహం తర్వాత ఆ స్థాయిలో తెలంగాణ ఉద్యమం సాగుతోందని తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ప్రజలపై ప్రభుత్వం హింసను ప్రయోగించిందని, అయినప్పట్టికీ రైల్ రకోను ప్రజలు విజయవంతం చేశారని ఆయన ప్రకటించారు. మహిళలను రాత్రంతా పోలీస్ స్టేషన్ లలో ఉంచారని, మహిళా నేత హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం డిజిపినే ఎవరిపై ఏ కేసులు పెట్టాలో నిర్దేశించారని కోదండరామ్ ఆరోపించారు.రాష్ట్రంలో అనాగరిక పాలన జరుగుతోంటే కేంద్రం చోద్యం చూస్తున్నదని ఆయన అన్నారు. కాగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన మంత్రులు సమ్మలను విరమించాలని కోరడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. జై తెలంగాణ నినాదం చేసిన వ్యక్తిపై మంత్రి దానం నాగేందర్ దాడి చేయడం దారుణమని ఆయన ఆరోపించారు. సోమవారం బంద్ ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!