అద్భుత దృశ్యకావ్యం శ్రీ‌రామ‌రాజ్యం


నంద‌మూరి బాల‌కృష్ణ రాముడిగా, న‌య‌న‌తార సీత‌గా, బాపు ద‌ర్శక‌త్వంలో అత్యద్భుతంగా తెర‌కెక్కిన చిత్రం శ్రీ‌రామ‌రాజ్యం. ఈ చిత్రం ఆడియో అభినంద‌న స‌భ సోమ‌వారం నాడు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, డి.రామా నాయుడు, కృష్ణంరాజు, శ్రీకాంత్, కోడిరామకృష్ణ, కైకాల సత్యనారాయణ, బాలయ్య, బ్రహ్మానందం, గిరిబాబు, మురళీమోహన్, జొన్నవిత్తుల, ఎం.ఎల్.కుమార్‌చౌదరి, సాగర్, బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హీరో నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ‘‘తెలుగు చూడాలంటే బాపు… తెలుగు వినాలంటే రమణ. అందుకు నిదర్శనమే ఈ శ్రీరామరాజ్యం. ఈ రోజు రాముడిగా నన్ను చూశారు. రేపు ఈ రాముడు పలుకులు ఎలా ఉంటాయో వింటారు. ఒక దృశ్యకావ్యంగా ఈ సినిమాను మలిచారు బాపు. ఆయన తప్ప ఈ కథను ఇంతబాగా తీయగలిగిన వారు లేరు’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ శ్రీ‌రామ‌రాజ్యం చిత్రం అద్భుత దృశ్య కావ్యంగా తెలుగు సినీ చ‌రిత్రలోనిలిచిపోతుంద‌ని ప‌లువురు వ‌క్తలు వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!