కోదండరామ్ ఇళ్ళు ముట్టడి

తెలంగాణ సమ్మెను తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ నీరుకార్చుతున్నారంటూ తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యంలో కోదండరామ్ ఇంటిని ముట్టడించడం విశేషం.సకల జనుల సమ్మెను చేపట్టి తెలంగాణ ప్రజలు అనేక కష్టాలకు కారకులైన కోదండరామ్, ఇప్పుడు సమ్మె ఎందుకు విరమిస్తున్నారో చెప్పాలని ప్రజాసంఘాల జెఎసి నాయకుడు గజ్జల కాంతం డిమాండ్ చేశారు. ఆయన తన మద్దతుదారులు కొందరితో కలిసి కోదండరామ్ ఇంటిని ముట్టడించడం విశేషం. కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడించాలని ,తెలంగాణ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని గతంలో పిలుపు ఇచ్చిన కోదండరామ్ ఇంటినే కొందరు ఆందోళనకారులు ముట్టడించడం విశేషం.అయితే కోదండరామ్ ఇంటిని గజ్జల కాంతం బృందం ముట్టడించడాన్ని కోదండరామ్ మద్దతుదారులు తీవ్రంగా తప్పు పడుతున్నారు.కోదండరామ్ తెలంగాణ సాధనకోసం గట్టికృషి చేస్తున్న నాయకుడికి వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదని అన్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విభజించు పాలించే విధానంలో భాగమేనని వారు ధ్వజమెత్తారు. ఏది ఏమైనా గజ్జల కాంతం గత కొద్ది రోజులుగా కోదండరామ్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు సాగిస్తున్నారు.శుక్రవారం ఏకంగా ఇంటిని ముట్టడించారు. గజ్జల కాంతం బృందాన్ని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!