ఎమ్మెల్యేల‌కే టోపీ పెట్టిన ఘ‌నుడు


ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కి టోపీ పెడ‌తార‌న్న భావ‌న ఉంది. కానీ.. ప్ర‌జానాయ‌కులు సాక్షాత్తూ శాస‌న‌స‌భ్యుల‌కే కుచ్చుటోపీ పెట్టి ల‌క్ష‌ల రూపాయ‌లు నొక్కేసిన ఘ‌నుడు కూడా ఉన్నాడంటే.. అంద‌రూ నోరెళ్ళ‌బెట్టారు. కోటేశ్వర రావు అనే ఆ మోసగాడు రాజీవ్ యువకిరణాలు పథకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పది మంది శాసనసభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన శానససభ్యులు అతని చేతిలో మోసపోయారు. తాను రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టు డైరెక్టర్‌నని, జిల్లా మంత్రులు సిఫార్సుతో తాను ఉద్యోగాలు ఇప్పించడానికి ముందుకు వచ్చానని చెప్పి ఎమ్మెల్యేల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కో ఎమ్మెల్యే నుంచి అతను 50 వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేశాడు.
నర్సాపురం శాసనసభ్యుడు ప్రసాద రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటేశ్వర రావు మోసం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రసాద రాజు ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత ఓ మహిళను పట్టుకున్నారు. ఆమె ద్వారా కోటేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. తాను వసూలు చేసిన డబ్బును కోటేశ్వర రావు ఆ మహిళ ఖాతాలోనే జమ చేశాడు. కోటేశ్వరరావు అసలు పేరు తోట బాలాజీ. అతను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వాసి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!