అద్వానీ యాత్ర‌లో బాంబుల క‌ల‌క‌లం..


భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వాని రధయాత్ర మార్గంలో బాంబులు దొరకడం కలకలంగా మారింది.ప్రస్తుతం అద్వాని తమిళనాడులో రధయాత్ర చేస్తున్నారు. అద్వాని అవినీతికి వ్యతిరేకంగా రధయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మధురై సమీపంలోని అలంపట్టి ప్రాంతంలో రెండు బాంబులను పోలీసులు కనుగొన్నారు. దీనితో రధయాత్ర ను వేరే దారిలో గుండా కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో అద్వానిపై కోయంబత్తూర్ వద్ద హత్యాయత్నం కూడా జరిగింది. అప్పుడు ఉగ్రవాదులు బాంబులు పేల్చగా పలువురు మరణించారు.అయితే అద్వాని రాక ఆలస్యం అవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.ఇప్పుడు మధురై ప్రాంతంలో బాంబులు దొరకడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!