ఆధిక్యంలో పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి


బాన్సువాడ ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ ఈ రోజు మొద‌ల‌య్యింది. ఓట్ల లెక్కింపులో సెకండ్ రౌండ్‌కి వ‌చ్చే స‌రికి పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి 8,235 ఓట్ల ఆధిక్యంతో కొన‌సాగుతున్నారు. బాన్సువాడ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు అంద‌రూ ఊహించిన‌వే. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమ‌యింది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పోచారం టి.ఆర్‌.ఎస్‌. అభ్యర్థిగా బ‌రిలోకి దిగ‌గా కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ‌నివాస్‌గౌడ్ నిల‌బడ్డారు. టిడిపి త‌మ అభ్యర్థిని రంగంలోకి దించ‌లేదు. దీంతో పోచారం గెలుపు ఖాయ‌మేన‌ని తెలుస్తోంది. అయితే ఆయ‌న ఎంత మెజారిటీతో గెలుపొందుతాడ్నదానిపైనే అంద‌రి దృష్టి నెల‌కొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!