దురుద్దేశంతోనే బాబు ప్ర‌చారం..


రాజకీయ పార్టీలు చందాలు వసూలు చేయడంలో తప్పులేదని తెలంగాణ జాగృతి సంస్థ నేత కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు కుమార్తె అయిన కవిత తన తండ్రికి మద్దతుగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నదని ఆమె అన్నారు. టిడిపి అధినేత చంద్రభాబు నాయుడు పాలు అమ్మిన డబ్బుతో పార్టీని నడుపుతున్నారా అని కవిత ప్రశ్నించారు.పోలవరం టెండర్లను రద్దు చేయాలని టిఆర్ఎస్ డిమాండ్ చేసిందని ఆమె గుర్తు చేశారు.ప్రజాభిమానం కోల్పోయిన చంద్రబాబు నాయుడు కెసిఆర్ ను టార్గెట్ చేసుకున్నారని ఆమె అన్నారు.కాగా తెలంగాణ ఉద్యమానికి విరామమేకాని, విరమణ లేదని కవిత స్పష్టం చేశారు.స్వామిగౌడ్ పై ఆరోపణలు కుట్రపూరితమని ఆమె విమర్శించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!