కేకే బృందంతో ర‌హ‌స్య చ‌ర్చలు..


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో ఉన్నసమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరితో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నాయకత్వంలోని బృందంతో చర్చలు జరుపుతోంది. ఇరు ప్రాంతాల నాయకులతో ఒక అవగాహన కుదర్చడం కోసం అధిష్టానం గట్టి ప్రయత్నం చేస్తోంది.కాని ఇరు ప్రాంతాల నేతలు తమ,తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో సమస్య ఒక కొలిక్కి రావడం లేదు.ఈ పరిస్థితిలో ఏమి చేయాలో అధిష్టానానికి అంతుపట్టడం లేదు. మరి రహస్య చర్చలు ఏమైనా ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకువస్తాయా అన్నది చూడాలి.కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ను కలిసి సకల జనుల సమ్మె తదితర అంశాలపై వివరణ ఇస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!