ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు


పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా రాజ్‌భవన్‌లోని దర్బారు హాలులో గవర్నర్ దంపతులు బుధవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక పుర ప్రముఖులను కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుతారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజలకు సర్వసుఖాలు, శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించాలని, అందరిలో ఐక్యమత్యాన్ని పెంపొందించి రాష్ట్ర పురోభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేసేలా ప్రేరణ కలుగ జేయాలని బాబు ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా దీపావళి పండుగ ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!