కాంగ్రెస్ వీడితే తెలంగాణ ఆల‌స్యం


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితో తెలంగాణ సాధన మరింత ఆలస్యం అవుతుందని నిజామాబాద్ ఎమ్.పి మదుయాష్కి అన్నారు. రెండువేల పద్నాలుగు నాటికి తెలంగాణను సాధించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని కూడా ఆయన చెప్పారు.టిఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరితే పార్టీ బలోపేతం అవుతుంది కాని తెలంగాణ రాదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా మరో సీనియర్ నేత కేశవరావు కూడా టిఆర్ ఎస్ పార్టీ కాస్త సున్నితంగా వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను చీల్చడానికి ప్రయత్నించడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమని, సోనియాగాందీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అధికారంలో ఉండి జైలుకు వెళ్లామని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ను చీల్చితే ఉద్యమానికి దెబ్బ అని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చే పార్టీని వదలి, రోడ్డుమీద అరిచే పార్టీలో చేరితే ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!