విమానానికి రెక్కలొచ్చాయి..


ముంబ‌యిలో ఓ విమానానికి రెక్కలొ చ్చాయి.. దాంతో అది గాల్లోకి స‌ర్రున లేచిపోయింది.. అన్నట్టు విమానాలు గాల్లోనే క‌దా ఎగిరేవి అని క‌దా.. అవును.. విమానాలు గాల్లోనే ఎగురుతాయి.. కానీ ఈ విమానం ప్రయాణీకుల‌ని వ‌దిలేసి చ‌క్కగా ఎగిరిపోయింది.. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఎయిర్ ఇండియా సంస్థ అసలే నష్టాలలో ఉందని అంతా అంటారు. అలాంటి సంస్థ ప్రయాణికులకు సేవలందించడంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాని వీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ముంబై నుంచి హైదరాబాద్ రావలసిన విమానం ఎక్కడానికి ఏభై మంది ప్రయాణికులను అక్కడే వదలివేసి బయల్దేరిందట.వారంతా బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటి చెక్ కూడా పూర్తి చేసుకుని ప్రయాణానికి సిద్దంగా ఉన్నారు.అంతమందిని వదలిపెట్టి ఎందుకు బయల్దేరిపోయిందో, దానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు. ఇంత అధ్వాన్నంగా విమానాలను నడిపితే ప్రయాణికులు ప్రైవేటు సంస్థల వైపు ఆకర్షితులు కాకుండా ఎలా ఉంటారు?విమానం చెప్పాపెట్టకుండా ఎగిరిపోవడంతో అక్కడ ఆ ప్రయాణికులంతా నానా అవస్థలు పడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!