రాష్ట్రానికి చేరుకున్న అద్వానీ ర‌థ‌యాత్ర


బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంది. మూడురోజులు పాటు జరగనున్న ఈ యాత్రలో మొదటిరోజు అదిలాబాద్ జిల్లాలో అడుగుపెట్టారు. షరామామూలుగానే అద్వానీ తెలంగాణపై గళం విన్పించారు. మేం అధికారంలోకి వస్తే తెలంగాణ తప్పకుండా ఇస్తామని మరోసారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల చిన్నరాష్ట్రాల విషయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విదర్భలో రైతులు, తెలంగాణలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, తెలంగాణ ప్రజల వెన్నంటే బీజేపీ ఉంటుందని అద్వానీ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఆదరణ చూపితే తప్పకుండా రాష్ట్రాన్ని విభజిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!