రూపాయికే కిలోబియ్యం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్ర పేద ప్రజ‌ల‌కు ఒక్కరూపాయికే కిలోబియ్యాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనీ పూర్తి చేసింది. గ‌తంలో నంద‌మూరి తార‌క‌రామారావు ప్రవేశ‌పెట్టిన 2 రూపాయ‌ల‌కే కిలో బియ్యం ప‌థ‌కానికి ధీటుగా రూపాయికే కిలో బియ్యం ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ప్రభుత్వం భావిస్తోంది.. అందుకే రాష్ట్రంలో ఏడున్నర కోట్ల కంటే ఎక్కువ మందికి రూపాయికి కిలో బియ్యం పథకం అమలు చేయనున్నట్టు సీఎం కార్యాలయం(సీఎంవో) తెలిపింది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న(బీపీఎల్) మొత్తం 2.6 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. మంగళవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లోని అన్ని రేషన్ షాపుల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు సీఎంవో వివరించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!