గాలికి మ‌ళ్లీ ఎదురుగాలే..!


ఓఎంసీ కేసులో అరెస్ట్ అయిన గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిల రిమాండ్ ను నవంబర్ 14వ తేదీ వరకూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నేటితో వారి రిమాండ్ గడువు ముగియటంతో కేసు విచారణలో ఉన్నందున మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. దాంతో న్యాయస్థానం రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా భద్రతా కారణాల రీత్యా గాలి జనార్ధనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలను చంచలగూడ జైలులో వీడియో కాన్పరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారణ జరిపింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!