జానాతో టి-ఎంపీల వాగ్వాదం..


రైల్ రోకో తర్వాత సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ భేటీ వాడివేడిగా సాగింది. టి.ఎంపీలంతా హాజరయిన ఈ భేటీకి మంత్రి జానారెడ్డి మాత్రమే హాజరయ్యారు. దీంతో జానారెడ్డిని తెలంగాణ ఎంపీలంతా విరుచుకుపడ్డారు. ఎంపీలంతా అరెస్టలయితే మీరేం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి దానంను అడ్డుకుంటే స్పందించిన పిసిసి చీఫ్ బొత్స ఎంపీలంతా అరెస్టులయితే కనీసం పట్టించుకోవడం కానీ, పరామర్శ చేయడం కానీ చేయలేదని వాపోయారు. సీఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్సలు సమైక్యాంధ్రకు మద్ధతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఎంపీలపై అక్రమకేసులు పెడితే బొత్స ఎందుకు స్పందించడం లేదని ఎంపీ పొన్నం ప్రశ్నించారు. ఇంతా జరుగుతున్నా కేబినేట్ లో ఉన్న మంత్రులు కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వాపోయారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!