కేసీఆర్ ఆస్తుల వివ‌రాలు చెప్పాల్సిందే..!


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ టిడిపి నేతల మాటలయుద్ధం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మూడురోజుల నుంచి మోత్కుపల్లి,ఎర్రబెల్లి తదితరులు మాట్లాడిన తర్వాత నిన్న డైరెక్ట్ గా చంద్రబాబే కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఇవాళ మరోసారి టిడిపి సీనియర్ నేతలు తుమ్మలనాగేశ్వరరావు, రేవంత్ రెడ్డిలు విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన ఆస్తుల వివరాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఉద్యమం ప్రారంభమైన తర్వాత కేసీఆర్ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు. పోలవరం టెండర్ల కోసం తెలంగాణ ఉద్యమాన్నికేసీఆర్ తాకట్టుపెట్టారని, అందువల్ల టెండర్లను రద్దు చేయాలని తుమ్మలనాగేశ్వరరావు డిమాండ్ చేశారు.విచిత్రమేమిటంటే టిడిపి నేతలు కానీ,అధినేత కానీ ఇంతగా విమర్శిస్తున్నా టీఆర్ఎస్ నేతలు వినోద్,రాజేందర్ లతో మాట్లాడించారే తప్ప కేటీఆర్, హరీష్ రావులు ఆస్థాయిలో స్పందించకపోవడం, కేసీఆర్ కూడా ఈ అంశంపై మాట్లాడకపోవడంతో ఎలాంటి వ్యూహం పాటిస్తున్నారో రాజకీయవిశ్లేషకులకు సైతం అర్థం కావట్లేదు సరికదా కాస్త అనుమానాలకు తావు ఇచ్చే విధంగా ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!