కొన‌సాగుతున్న తెలంగాణ బంద్‌


తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు డిపోల్లో బస్సులు నిలిచిపోగా, మరికొన్ని డిపోల ఎదుట తెలంగాణవాదులు ధర్నాకు దిగారు. కాగా విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. బంద్ కారణంగా సికింద్రాబాద్-ఫలక్ నూమ మధ్య ఎంఎంటీఎస్ సర్వీస్ లు రద్దు అయ్యాయి. ప్రభుత్వ అనాగరిక చర్యలు, పాశవిక పాలనలపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఆర్‌.టి.సి.పై ఈ బంద్ ప్రభావం స్పష్టంగా క‌నిపిస్తోంది. నిన్నటి (ఆదివారం) నుండే బ‌స్సులు రోడ్డుపైకి వ‌చ్చాయి. అయితే ఒక్కరోజుకూడా న‌డ‌వ‌క‌ముందే బంద్ కార‌ణంగా బ‌స్ డిపోల్లోనుండి బ‌స్సులు బ‌య‌టికి రాకుండా ఆయా డిపోల ఎదుట ఉద్యమ‌కారులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!