కూనంనేని ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..

ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయనకు వెంటనే వైద్యం చేయకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదమని డాక్టర్లు వెల్లడించారు. కూనంనేని వైద్యం చేయించుకునేందుకు నిరాకరించటంతో డాక్టర్లు పరిస్థితిని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. ఆయన చేపట్టిన దీక్ష నేటికి ఆరోరోజుకు చేరింది. కాగా నేడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, ప్రజా గాయకుడు గద్దర్ లు కూనంనేనిని పరామర్శించనున్నారు. వారు కూనంనేనినతో దీక్ష విరమింపచేసే యోచనలో ఉన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!