చెర్రీ, ఉపాస‌న‌ల నిశ్చితార్థం డిసెంబ‌ర్‌లో..


ఎట్ట‌కేల‌కు మెగాస్టార్ త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ తేజ‌, అపోలో గ్రూపు సంస్థ‌ల అధినేత ప్ర‌తాప‌రెడ్డి ముమ‌రాలు ఉపాస‌న‌తో నిశ్చితార్థం ఖ‌రార‌యింది. డిసెంబ‌ర్ 1వ తేదీన వీరికి నిశ్చితార్థం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ని చిరంజీవి త‌న స‌తీమ‌ణి సురేఖ‌, పుత్రుడు రాంచ‌ర‌ణ్‌తేజ‌ల‌తో వెళ్ళి క‌లిసారు. త‌న కుమారుడి నిశ్చితార్థానికి రావాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్‌ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. అయితే చిరు నిశ్చితార్థం దోమ‌కొండ కోట‌లో జ‌రుగుతుంద‌ని, దాని కోసం ఆ కోట‌ని ముస్తాబు చేస్తున్నారు.. ఇందుకోసం దాదాపు 4 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ర‌క‌ర‌కాల రూమ‌ర్స్ వ‌చ్చాయి.. కానీ.. చిరు నిశ్చితార్థం ఎక్క‌డ జ‌రుగుతుంద‌న్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గానే మిగిలింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!