చిదంబ‌రంపై మ‌రో ఆరోప‌ణ‌


కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరం పై ఆరోపణలు ఒక్కొటొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే 2 జి స్పెక్ట్రమ్ కేసులో చిదంబరం కూడా నిందితుడేనంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు గుప్పిస్తూ సుప్రింకోర్టు వరు తీసుకువెళ్లగా తాజాగా మరో కుంభకోణం కూడా ఆయనను వెన్నాడుతోంది. చిదంబరం ఆర్ధిక శాఖ మంత్రిగా ఉండగా ఓడాఫోన్, హాచ్ సిన్ కంపెనీల మధ్య ఒప్పందానికి అక్రమంగా అనుమతి ఇచ్చారని, ఓడాఫోన్ కంపెనీ పద్నాలుగు వేల కోట్ల పన్నును ఎగవేసిందంటూ మీడియాలో కధనాలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక శాఖ అదంతా బూటకమని చెబుతోంది. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇది ఎటు మలుపు తిరుగుతుందన్నది చర్చనీయాంశంగా ఉంది.మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ 2 ప్రభుత్వానికి ఆరోపణలపై ఆరోపణలు వస్తూ ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!