రెండు రోజుల్లో స‌క‌ల స‌మ్మె ప‌రిస‌మాప్తం..?


సకల జనుల సమ్మె రెండు రోజులలో ముగుస్తుందని మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో సమ్మె ప్రభావం లేదని కూడా ప్రకటించడం విశేషం. కాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కూడా ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి సమ్మె గురించి ఈ విధంగా మాట్లాడడం తెలంగాణ ఆందోళనకారులకు కాస్త ఆగ్రహం తెప్పించే విషయమే.అయినప్పట్టికీ ఆయన ధైర్యంగా మాట్లాడారని అనుకోవాలి.కాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కేశవరావు వంటి నేతలు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వెంకటరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడడం కూడా ఆసక్తికరంగా ఉంది.

కామెంట్‌లు

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఓ ఖమ్మం జిల్లా మంత్రా? నే ఆంధ్రప్రదేశ్ మంత్రేమో అనుకున్నా.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!