కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల‌పై ఎర్రబెల్లి ద్వజం


మంత్రి జానారెడ్డి మరో చెన్నారెడ్డి అవుతున్నారని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. బాన్సువాడ ఉప ఎన్నికలో టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కయ్యిందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చేవరకూ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఉద్దేశ్యంతోనే తాము బాన్సువాడలో అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు.
తెలంగాణ కోసం తాము రాజీనామాలు చేశామే కానీ… కాంగ్రెస్ వారెవ్వరూ రాజీనామా చేయలేదన్నారు. టీఆర్ఎస్, జేఏసీ నేతలకు కాంగ్రెస్ అంటే ఎందుకంత ప్రేమో చెప్పాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ జిల్లాలలో కలెక్టరేట్ల వద్ధ ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!