ఓట‌మికి కారణం నేనే – ధోని


ముంబయి ఇండియన్స్ చేతిలో అనూహ్య పరాజయానికి తానే కారణమని చెన్నయ్ సారథి ధోనీ అంగీకరించాడు. మలింగను స్టంప్ అవుట్ చేసే చాన్సును చేజేతులా జారవిడిచి జట్టు ఓటమికి బాధ్యుణ్నయ్యానని ధోనీ చెప్పుకొచ్చాడు. ముంబయి లక్ష్యఛేదన సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జకాటి బౌలింగ్‌లో మలింగ షాట్ కొట్టేందుకు ముందుకురకగా బంతిని అందుకోవడంలో ధోనీ విఫలమయ్యాడు.
అప్పటికి 18 పరుగుల వ్యక్తిగత స్కో రు మీదున్న మలింగ ఆ తర్వాత సిక్స్‌లు ఫోర్లతో విరుచుకుపడి జట్టును గెలుపు తీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ, ‘స్టంపింగ్ మిస్ చేసి మ్యాచ్‌ను మూల్యంగా చెల్లించుకున్నాం. మున్ముందు ఇలాంటి పొరబాట్లకు తావివ్వమ’ని చెప్పాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!