ఏ ఛానెల్ దారి ఆ ఛానెల్ దే..


టివీ న్యూస్ ఛానెళ్ల తీరు వీక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసేవిగా ఉంటున్నాయి. ఏది నిజమో, మరేది అబద్దమో మీరే తేల్చుకోండని ఛానెళ్లు వార్తల చెత్తను మన మొహాన పడేస్తున్నాయి. దమ్మున్న ఛానెల్ అంటూ ప్రచారం చేసుకున్ఏబీఎన్ ఛానెల్ శుక్రవారం (16-09-11) నుంచీ అంబటి రాసలీలల వార్తను కళ్లకు కడితే, మరో పక్క సాక్షి ఛానెల్ అందుకు విరుద్ధమైన వార్తాకథనాలు ఇస్తూ గంటలకు గంటలు దొర్లించింది. ఎబిఎన్ ఛానెల్‌లో అంబ‌టి గురించి చ‌ర్చాకార్య‌క్ర‌మాల‌తో ముందుకు సాగుతుంటే, సాక్షి చానెల్ వేమూరి రాధాకృష్ణ బ్లాక్‌మెయిల్‌కి పాలుప‌డ్డార‌న్న మంజు అనే అమ్మాయిని హైలెట్ చేస్తూ వార్తా క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి.. అస‌లు ట్విస్ట్ ఏమిటంటే ఈ మంజు అనే అమ్మాయితోనే అంబ‌టి రాంబాబు ఫోన్‌లో మాట్లాడాడ‌ని ఆమె చెబుతోంది. ఇలా ఈ రెండు ఛానెల్స్‌లో వ‌స్తున్న క‌థ‌నాల‌కు వీక్ష‌కులు క‌న్‌ఫ్యూజ‌న్‌కి గుర‌వుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!