ఎస్‌.పి. చ‌ర‌ణ్ అత్యాచారయ‌త్నం


ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్.పి.చరణ్ ఒక మహిళపై అత్యాచార యత్నం చేశాడన్న కేసు నమోదైంది. చరణ్ ఇటీవల ఒక పార్టీలో ఉండగా , సోన అనే తమిళనటి పట్లు అభ్యంతరకరంగా వ్యవహరించడమే కాకుండా అత్యాచార యత్నం చేశాడున్నది అబియోగం. సోనా ఈ మేరకు పాండీ బజాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.సోన నటీ మాత్రమే కాక, నిర్మాతగా కూడా ఉన్నారు. ఆమెపట్ల చరణ్ అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నప్పుడు దర్శకుడు వెంకట ప్రభు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ సినీ గాయకుడిగా సినీరంగంలోనే ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం ఎంతో గొప్పవ్యక్తిగా పేరు తెచ్చుకుంటే ఆయన కుమారుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం బాధాకరం.మన్ కధ సనిమా సక్సెస్ మీట్ లో ఈ గొడవ జరిగింది. మత్తు పరిస్థితిలో ఉన్న చరణ్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడని ఆమె విలేకరులకు చెప్పారు. చరణ్, వెంకట ప్రభు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!