రికార్డు స్థాయిలో దూకుడు రిలీజ్
ప్రిన్స్ మహేష్బాబు, సమంత, శ్రీనువైట్ల కాంబి నేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొం దిన చిత్రం దూకుడు. సెప్టెంబర్ 23వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది. మహేష్ బాబు ఈ చిత్రంపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తన కెరీర్లోనే భారీ విజయం సాధించిన పోకిరి చిత్రాన్ని దూకుడు అధిగమి స్తుందని ఆశిస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలోనూ మహేష్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం రిలీజ్కు ముందే రికార్డులు నెలకొల్పుతోంది. అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఒక్క హైదరాబాద్లోనే 70 థియేటర్లకి పైగా విడుదలవుతోంది. ఇంతుకుముందు ఏ చిత్రం కూడా ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. అలాగే చెన్నైలో 15 థియేటర్లలో, అమెరికాలో 85 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతుంది. గతంలో ఏ చిత్రం నెలకొల్పని రికార్డు ఇది. ఇక దూకుడు చిత్రం భారీ విజయం సాధిస్తుందని మహేష్ అభిమానులు కూడా భావిస్తున్నారు. బుధవారం నుండే దూకుడు చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవడం, టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం కూడా జరిగిపోయింది. భారీ అంచనాలతో వస్తున్న దూకుడు చిత్రం అంచనాలని అధిగమిస్తుందా.. లేక మరో అతిథి, ఖలేజాలా చతికిల బడుతోందా.. అన్నది శుక్రవారం నాడు తేలిపోతుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి