అంబ‌టి రాస‌లీల‌లు లో కొత్త ట్విస్ట్‌..


అంబ‌టి రాంబాబు ఎబిఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌పై పోలీస్‌కంప్లైంట్ ఇచ్చారు. ఎబిఎన్ ఛానెల్ త‌న‌ని అప్ర‌తిష్ట‌పాలు చేయాల‌ని, రాజ‌కీయంగా త‌న ఇమేజ్‌ని దెబ్బ‌తీయాల‌ని కుట్ర‌ప‌న్ని త‌న‌పై అస‌త్య వార్తా క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసార‌ని తీవ్రంగా ద‌య్య‌బ‌ట్టారు. అయితే ఇందులో మ‌రొక ట్విస్ట్ ఏమిటంటే..ఆ ఛానల్‌లో వచ్చిన‌ కథనాన్ని మంజు అనే అమ్మాయి ఖండించారు. ఎబిఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ తనపై ఒత్తిడి తీసుకు వచ్చి అంబటితో తప్పుడుగా మాట్లాడించారని ఆమె వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి ఛానల్ ముందుకు వచ్చి చెప్పారు. ఈ స‌ద‌రు మంజు అనే అమ్మాయిని వేమూరి రాధాకృష్ణ‌, ఎబిఎన్ ఛానెల్లో ఉండే క్రాంతి అనే వ్య‌క్తి వీరిద్ద‌రూ క‌లిసి త‌న‌ని బ్లాక్ మెయిల్ చేసార‌ని, అస‌లు అంబ‌టి రాంబాబుని ఎప్పుడూ తాను క‌ల‌వ‌నేలేద‌ని మంజు ఆరోపించారు. దీనికంత‌టికీ ప్ర‌ధాన సూత్ర‌ధారి ఎబిఎన్ ఛానెల్ ఎం.డి. వేమూరి రాధాకృష్ణ‌నే అని మంజు ఆరోపిస్తుంది. మ‌రో వైపు అంబ‌టి రాంబాబు కూడా త‌న‌కేపాపం తెలియ‌దని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే తాను చిరంజీవి అభిమానినని, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తగా పని చేశానన్నారు. పిఆర్పీ కార్యకర్తగా ఉన్న సమయంలో ఆ ఛానల్ చిరుకు వ్యతిరేకంగా ప్రసారం చేసినప్పుడు మహిళలతో వెళ్లి గట్టిగా నిరసన తెలిపానన్నారు. ఆనాటి ఘటనను దృష్టిలో పెట్టుకొని ఆ ఛానల్ ఆ తర్వాత తనను బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించారు. ఆ ఛానల్‌పై తన నిరసనను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నెట్‌లో తన ఫోటోలు పెడతానని బెదిరించారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని బెదిరింపులకు కూడా గురి చేశారన్నారు. వారి ఒత్తిడి కారణంగానే అంబటితో నేను తప్పుడుగా మాట్లాడానన్నారు. దయచేసి ఈ వాస్తవాన్ని మీడియా ప్రజలకు వెల్లడించాలని కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!