కేసీఆర్‌తో అస‌దుద్దీన్ భేటీ..


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావును ఎమ్.ఐ.ఎమ్. అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అవడం రాజకీయంగా ఆసక్తికర ఘట్టంగా మారింది. రెండు రోజుల క్రితం సకల జనుల సమ్మెకు వ్యతిరేకమని, తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ప్రకటించిన ఒవైసీ ఆకస్మికంగా కెసిఆర్ ను కలవడం విశేషం. అయితే తెలంగాణ అంశానికి ఈ బేటీకి సంబందం లేదని, ముస్లింలకు సంబందించిన సచార్ కమిటీ నివేదిక అమలు విషయంపై అన్ని రాజకీయ పార్టీలతో ఒవైసీ కలుస్తున్నారని, అందులో భాగంగా ఆయన కెసిఆర్ ను కలిసారన్నది సమాచారం. అయితే ఈ సందర్భంగా తెలంగాణ అంశం కూడా ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!